E-Paper
Advertisement

IND vs ENG 2nd Test : విశాఖ మ్యాచ్ ముందు.. పదనిసలు!

IND vs ENG 2nd Test : విశాఖ మ్యాచ్ ముందు.. పదనిసలు!
Advertisement
IND vs ENG 2nd Test

IND vs ENG 2nd Test : విశాఖపట్నంలో జరగనున్న రెండో టెస్ట్ కి సంబంధించి నెట్టింట పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ అంటున్నాడు. మేం మొత్తం ఐదుగురు స్పిన్నర్లతో దిగుతామని తెలిపాడు. అంటే మొదటి టెస్ట్ లో ఒకే ఒక పేసర్, నలుగురు స్పిన్నర్లతో దిగింది. దీంతో టీమ్ ఇండియా బ్యాటర్లు ఓవర్ డిఫెన్స్ కి పోయి  వికెట్లు కోల్పోయారు.

కానీ టీమ్ ఇండియా మాత్రం ఇద్దరు పేసర్లతో సంప్రదాయంగా దిగి… కంగు తింది. హైదరాబాద్ మ్యాచ్ లో మనవాళ్లు కూడా నలుగురు స్పిన్నర్లతో దిగి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. అందుకని ఈసారి పిచ్ సహకరిస్తే నలుగురు స్పిన్నర్లతో టీమ్ ఇండియా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అలాంటి పరిస్థితి వస్తే ఉన్న పేసర్ ని కూడా తీసేసి ఐదుగురు స్పిన్నర్లతో దిగుతామని ఇంగ్లాండ్ కోచ్ తెలిపాడు.

Advertisement

ఐదుగురు స్పిన్నర్లే అన్న వార్త హల్చల్ చేస్తుంటే, మొత్తానికి రెండు జట్ల క్రికెటర్లు విశాఖ చేరుకున్నారు. ప్రాక్టీసు మొదలెట్టేశారు. ఏసీఏ- వీడీసీఏ అంతర్జాతీయ మైదానంలో ఈ మ్యాచ్ మొదలు కానుంది.  ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. క్రికెటర్లందరూ విశాఖలోని నోవాటెల్ హోటల్ కి చేరుకున్నారు. వీరిని చూడటానికి అభిమానులు హోటల్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసుల భద్రతను పెంచాల్సి వచ్చింది.

మొదటి టెస్టులో తొడ కండరాలు పట్టీసిన రవీంద్ర జడేజా ఆసక్తికరమైన వ్యాక్యలు చేశాడు. కొన్నిరోజులు ఇదే తన ఇల్లు అని ఎన్సీఏ ఫొటో పెట్టి తెలిపాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో చేరిన జడేజా అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. నొప్పి చిన్నదే అయితే మూడో టెస్ట్ కి అందుబాటులో ఉంటాడని అంటున్నారు. దీంతో నెట్టింట…అన్నా… నువ్వు త్వరగా రావాలి…అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

కేఎల్ రాహుల్ గాయం చిన్నదేనని అంటున్నారు. తను కూడా ఎన్సీఏలోనే చికిత్స తీసుకుంటున్నాడు. అన్నీ కుదిరితే మూడో టెస్ట్ కు రాహుల్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇది టీమ్ ఇండియా నెత్తిమీద పాలు పోసినట్టయ్యింది. అప్పటికి కొహ్లీ కూడా వచ్చేస్తే, మళ్లీ టీమ్ ఇండియా పులి అయిపోతుందని అంటున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×