అంపైర్లు టీమిండియాకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలు అవుతోందని రెండు రోజుల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు ఖుష్దిల్ షా (Khushdil Shah). అయితే ఈ వ్యాఖ్యలు దుమారం రేపిన రెండు రోజులకే మళ్లీ టీమిండియాపై విషం కక్కారు. అంపైర్లే కాదు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా టీమిండియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి విషయంలో టీమిండియాకు అనుకూలంగానే ఐసీసీ ఉండడం వల్ల.. పాకిస్తాన్ ఓడిపోతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదే ఐసీసీ అండ దండలు లేకపోతే.. ఇండియాను చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు.
ప్రతి మ్యాచ్ లో కూడా ఇండియాపై వన్ సైడ్ వార్ కొనసాగి.. పాకిస్తాన్ విజయం సాధించేదని వ్యాఖ్యానించారు. ఐసీసీ బాస్ జై షా ఉండటం వల్లే, టీమిండియాకు అన్ని కలిసి వస్తున్నాయని ఆరోపణలు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి డబ్బులు తీసుకొని… ఐసీసీ ఇలా అమ్ముడుపోతోందని కూడా వ్యాఖ్యానించారు. ఐసీసీ పై బీసీసీఐ పెత్తనం ఉన్నన్ని రోజులు… పాకిస్తాన్ ఓడిపోవడం జరుగుతూనే ఉంటుందని బాంబు పేల్చారు. ఈ విషయంలో ఐసీసీ ద్వారానే మారాలని కోరారు. ఐసీసీ కుమ్మక్కు వ్యవహారం ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఎంతమంది తోపు క్రికెటర్లు వచ్చినా, టీమిండియాను ఓడించడం అసాధ్యం అన్నారు. బీసీసీఐ, ఐసీసీ అలాగే టీమ్ ఇండియా పై ఆరోపణలు చేసిన పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు ఖుష్దిల్ షాపై ఇండియన్ ఫ్యాన్స్ తమ స్టైల్ లో కౌంటర్ ఇస్తున్నారు. గాజులు వేసుకున్న దద్దమ్మలు ఇలాగే మాట్లాడుతారని మండిపడుతున్నారు. ఇండియాను నిజాయితీగా ఆడి ఓడించే ధైర్యం పాకిస్తాన్ కు లేదంటూ ర్యాగింగ్ చేస్తున్నారు.