E-Paper
Advertisement

రణరంగంగా మారిన నగరాలు.. పాక్ సైన్యం కాల్పుల్లో 30 మంది మృతి, 200 మందికి పైగానే

రణరంగంగా మారిన నగరాలు.. పాక్ సైన్యం కాల్పుల్లో 30 మంది మృతి, 200 మందికి పైగానే
Advertisement

Pakistan Army: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రణరంగంగా మారింది. అక్కడి ప్రజలు వివిధ అంశాలపై చేస్తున్న ఆందోళనను ఉక్కుపాదంతో అణిచి వేయాలని భావించింది. ఫలితంగా పాక్ సైన్యం కాల్పుల్లో 30 మంది పౌరులు మృతి చెందారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసలు అక్కడి ప్రజల సమస్యలేంటి? ఎందుకు పాక్ పాలకులు కొరడా ఝులిపిస్తున్నారు?

పాక్ సైన్యం కాల్పుల్లో 30 మంది మృతి

Advertisement

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజలు తిరుగుబాటు చేశారు. సబ్సిడీకి పిండి, విద్యుత్ అందించాలని, వీఐపీ సంస్కృతిని రద్దు చేయాలని కోరుతూ ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ నేతృత్వంలో సాగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఏడాది నుంచి ఆ కమిటీ వివిధ రూపంలో ఆందోళనలు చేస్తోంది. అయినా సరే పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదు.

వచ్చే నెల 27న అసెంబ్లీ ఎన్నికల్లో శరణార్థులకు 12 సీట్లు కేటాయించడంపై స్థానికుల నిరసనలు తీవ్రమయ్యాయి. ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి సుమారు 14 వేల మంది సైన్యాన్ని రంగంలోకి దించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కమిటీ నేతలను సైన్యం టార్గెట్ చేసింది.

Advertisement

పీఓకేలో ప్రజా ఉద్యమం, అణిచివేసేందుకు పాక్ సైన్యం రకరకాల కుట్రలు?

కీలక నేతలను హత మార్చడం, అర్ధరాత్రి వేళ నిర్బంధించడం వంటివి చేస్తున్నట్లు తెలుస్తోంది. నిరసన కారులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫలితంగా ప్రజలపై తుపాకీ ఎక్కుపెట్టింది పాక్ సైన్యం. ఈ కాల్పుల్లో 30 మంది మృతి చెందారు. దాదాపు 200 మంది వరకు గాయపడినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మిర్పూర్, ముజఫరాబాద్, గిల్గిత్-బాల్టిస్తాన్, రావాలాకోట్ ప్రాంతాల్లో ఆంక్షలను ధిక్కరిస్తూ నిరసనలు తీవ్రమవుతున్నాయి. మృతుల్లో పిల్లలు, మహిళలు, యువతీ యువకులు ఉన్నారు. మృతుల సంఖ్య సుమారు 30 మంది మరణించారని చెబుతున్నా, అనధికారిక లెక్కల ప్రకారం చెప్పిన సంఖ్యకు నాలుగైదు రెట్లు ఉండవచ్చని తెలుస్తోంది.

ALSO READ: మళ్లీ యుద్ధం మొదలు.. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు, ఖేష్మ్‌ దీవిలో బాంబుల మోత

దాదాపు 500 మందికి ప్రజలను సైనికులు అరెస్టు చేశారని స్థానిక నాయకులు చెబుతున్నారు. ప్రజలపై కాల్పులు చేయడాన్ని అక్కడి సైన్యం సమర్థించుకుంటోంది. అక్కడి ప్రజలు గెరిల్లా తరహా దాడులకు దిగడంతో ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేయాల్సి వచ్చిందని అధికారులు సమర్థించుకుంటున్నారు.పరిస్థితి గమనించిన పాక్ సైన్యం.. హింస చెలరేగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సేవలను గా నిలిపి వేసింది.

అయినా అక్కడి ప్రజలు ఏ మాత్రం తగ్గలేదు. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్ అస్త్రాలను బయటపెట్టింది. తప్పుడు సమాచారం, ఫేక్ వీడియోలను ప్రచారం చేయడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఇస్లామాబాద్ పాలకులు చేస్తున్న ప్రయత్నం ఇదేనని ఎద్దేవా చేసింది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×