E-Paper
Advertisement

IPL : మోహిత్ , గిల్ అదుర్స్.. పంజాబ్ పై గుజరాత్ గెలుపు..

IPL : మోహిత్ , గిల్ అదుర్స్.. పంజాబ్ పై గుజరాత్ గెలుపు..
Advertisement

IPL: ఐపీఎల్ -2023లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. గత మ్యాచ్ లో కోల్ కతా చేతిలో అనూహ్యంగా ఓడిన ఈ జట్టు తిరిగి పుంజుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మథ్యూ షార్ట్ (36), జితేశ్ శర్మ (25), శామ్ కరన్ (22), షారుఖ్ ఖాన్ (22) కాస్త రాణించారు. పంజాబ్ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా భారీ స్కోర్ సాధించకపోవడంతో ప్రత్యర్థి ముందు తక్కువ టార్గెట్ నే పెట్టింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మకు 2 వికెట్లు దక్కాయి. షమీ, జోష్ లిటిల్, జోసెఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(30, 19 బంతుల్లో 5 ఫోర్లు ), గిల్ (67, 49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. సాహా అవుటైనా గిల్ అదే జోరు కొనసాగించాడు. సాయి సుదర్శన్ (19), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ( 8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.

Advertisement

చివరి ఓవర్ లో టైటాన్స్ విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి. రెండో బంతికి గిల్ అవుట్ కావడంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. చివరి రెండు బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన తరుణంలో రాహుల్ తెవాటియా బౌండరీ కొట్టి గుజరాత్ ను గెలుపు తీరాలకు చేర్చాడు.

పొదుపుగా బౌలింగ్ చేసిన రెండు వికెట్లు తీసిన మోహిత్ శర్మకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు 4 మ్యాచ్ ల్లో 3 విజయాలతో గుజరాత్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ 4 మ్యాచ్ ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 6వ స్థానంలో ఉంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×