E-Paper
Advertisement

WTC Final : ఆసక్తిగా చివరి రోజు ఆట.. కోహ్లి, రహానే నిలబడతారా..?

WTC Final :  ఆసక్తిగా చివరి రోజు ఆట.. కోహ్లి, రహానే నిలబడతారా..?
Advertisement

WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ సమరం ఉత్కంఠభరిత ముగింపునకు చేరుకుంది. ఐదో రోజు ఆట ఆసక్తికరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్.. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టీమిండియా గెలవాలంటే.. చివరి రోజు 280 పరుగులు చేయాల్సి ఉంది. అదే 7 వికెట్లు పడగొడితే.. ఆస్ట్రేలియాదే విజయం. దీంతో ఐదో రోజు ఆట రసవత్తరంగా మారింది. విరాట్ కోహ్లి 44 పరుగులతో, అజింక్య రహానే 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

రోహిత్ శర్మ 43 పరుగులు చేయగా.. గిల్ 18 పరుగులు, పుజారా 27 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఆరంభంలో భారత్ అదరగొట్టినా.. వంద లోపు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయేసరికి.. ఆచితూచి ఆడాల్సిన అవసరం ఏర్పడింది. నాలుగో రోజు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో.. 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఆసీస్ వేగంగా స్కోర్ చేయలేకపోయింది.

రవీంద్ర జడేజా 3 వికెట్లు, ఉమేష్, షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. భారత్ కు 444 పరుగుల భారీ లక్ష్యం ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. -అయితే విజయం అయినా దక్కాలి.. లేకపోతే మ్యాచ్ ను కనీసం డ్రాగానైనా ముగించాలి. దీంతో ఇవాళ టీమిండియా ఆటతీరు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

క్రీజులో ఇంకా కోహ్లి, రహానే ఉండటం..అలాగే జడేజా, శార్దూల్ ఠాకూర్ బ్యాటతో రాణించగల సత్తా ఉన్నవారే. మొదట్లో వికెట్లు కాపాడుకుంటే భారత్ విజయాన్ని అందుకునే అవకాశాలుంటాయి. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా.. మ్యాచ్ వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని.. విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కోహ్లి, రహానే నిలబడతారా..? ఆసీస్ బౌలర్లను అడ్డుకుంటారా..? గద దక్కేదెవరికో? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×