E-Paper
Advertisement

Cricketers In Ayodhya Mandir : సచిన్, కోహ్లీ, జడేజా, కుంబ్లే సందడి.. నెట్టింట అయోధ్య జట్టు వైరల్..

Cricketers In Ayodhya Mandir : సచిన్, కోహ్లీ, జడేజా, కుంబ్లే సందడి.. నెట్టింట అయోధ్య జట్టు వైరల్..
Advertisement

Cricketers In Ayodhya Mandir : భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రామ మందిర ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ఏడువేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వారిలో చాలామంది అయోధ్య పురవీధులో సందడి చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ సతీసమేతంగా విచ్చేశాడు. విరాట్ కోహ్లీ , రవీంద్ర జడేజా, మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అయోధ్యలోని శ్రీరామమందిరం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

Advertisement

అనిల్ కుంబ్లే దంపతులు దేవాలయ ప్రాంగణంలో తిరుగుతూ కనిపించారు. అంతేకాదు భార్యతో కలిసిన ఫొటోలను ఎక్స్ లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే మాట్లాడుతూ రామమందిర ప్రారంభోత్సవం గొప్ప వేడుకని, ఇందులో భాగమవడం తన అదృష్టంగా పేర్కొన్నాడు.

ఇంకా మహేంద్ర సింగ్ ధోనీ, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్ సింగ్ , హర్మన్‌ప్రీత్ కౌర్‌ క్రికెటర్లు సహా పలువురు ఇతర ఆటగాళ్లు సైతం ఆహ్వానాలు అందుకున్నారు.

Advertisement

ఆహ్వానం దక్కిన ప్లేయర్లతో ‘అయోధ్య జట్టు’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అంతేకాదు వీరితో ఒక తుది జట్టును ప్రకటించారు. ఇందులో ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్‌, సునీల్ గవాస్కర్, వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీకి, ఇక నాలుగు, అయిదు, ఆరు  స్థానాల్లో గంగూలీ, రోహిత్ శర్మ, కపిల్ దేవ్ లకు అవకాశం కల్పించారు. 

అయోధ్య జట్టుకి కూడా మహేంద్రసింగ్ ధోనీయే కెప్టెన్ గా ఉంటాడు. వికెట్ కీపర్‌గా రాహుల్ ద్రవిడ్‌ ను సెలక్ట్ చేశారు. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్‌ తుది జట్టులోకి ఎంపికయ్యారు.

సెహ్వాగ్, గంభీర్, హర్భజన్ సింగ్ లకు తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై నెట్టింట ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 2011 వరల్డ్ కప్ ఇండియా గెలిచినప్పుడు గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడని చెబుతున్నారు. అలాంటివాడిని వదిలేయకూడదని అంటున్నారు. అలాగే హర్భజన్ సింగ్ కాంగ్రెస్ పార్టీతో గొడవ పెట్టుకుని మరీ అయోధ్య వచ్చాడని గుర్తు చేస్తున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×