E-Paper
Advertisement

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?
Advertisement

AI Bike Garuda: దేశంలో టాలెంట్‌కు కొదవలేదు. చాలామంది ప్రముఖులు చెబుతున్నమాట. కాకపోతే ప్రొత్సహంచేవారు తక్కువ. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు విదేశాలకు వలస పోతుంటారు. తాజాగా ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు తొలి ‘ఏఐ బైక్’ని రూపొందించారు. యువకుల ఈ బైక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఖర్చు ఎంతో తెలుసా? ఇంకా డీటేల్స్‌లోకి వెళ్దాం.

ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు శివమ్ మౌర్య-గురుప్రీత్ అరోరా-గణేశ్ పాటిల్ ‘గరుడ’ పేరుతో ట్రెండ్ కు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ ఆధారిత బైక్‌ను రూపొందించారు. ఆ బైక్‌ని 50 శాతం వ్యర్థాలు, మిగిలిన 50 శాతం కస్టమ్-మేడ్ భాగాలతో తయారు చేశారు. ఇందుకోసం వారు పెట్టిన ఖర్చు కేవలం రూ.1.80 లక్షలు మాత్రమే. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదూ.

Advertisement

గరుడ బైక్‌లో భద్రతకు అత్యంత ప్రయార్టీ ఇచ్చారు. అందులో ఉన్న రెండు హై-రేంజ్ సెన్సార్లు రియల్‌టైమ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తాయి. వాహనానికి 12 అడుగుల పరిధికి రాగానే బైక్ నెమ్మదిస్తుంది. ఏదైనా అడ్డు వచ్చిందంటే మూడు అడుగుల దూరంలో బ్రేకులు వేయకుండానే వాయిస్ కమాండ్ ద్వారా ఆగిపోతుంది.

ఏఐ ఆధారితంగా వచ్చిన ఈ బైక్ రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని చెబుతున్నారు విద్యార్థులు. ఇక ఫీచర్స్ విషయానికొద్దాం.  ఈ బైక్‌లో టచ్‌ స్క్రీన్ ఇంటర్‌ఫేస్ ఉంది. దీనిద్వారా జీపీఎస్ నావిగేషన్, ఫోన్ కాల్స్, మ్యూజిక్ వంటి ఫీచర్లను వినియోగించుకోవచ్చు. ముందు, వెనుక అమర్చిన కెమెరాల ద్వారా తన చుట్టూ ఉన్న ట్రాఫిక్‌ను డిస్‌ప్లే స్క్రీన్‌పై రైడర్ చూసే అవకాశం ఉంది.

Advertisement

ALSO READ: శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 రిపేర్ చేయడం కష్టం

వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వ్యవస్థ దీని సొంతం. ప్రొటోటైప్ మాత్రమే అయినప్పటికీ పనితీరు అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. గరుడ ఎకో మోడ్‌లో 220 కిలోమీటర్లు కాగా, అదే స్పోర్ట్ మోడ్‌లో 160 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. లిథియం, అయాన్ బ్యాటరీ కావడంతో కేవలం రెండు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.మార్కెట్లో ఉండే ఎలక్ట్రిక్ బైక్‌ల కంటే వేగంగా ఛార్జ్ అవుతుంది.

ముగ్గురు విద్యార్థులు కేవలం ఏడాది సమయంలో దీన్ని రూపొందించారు. ఆటోమొబైల్ నిపుణుడు వినోద్ దేశాయ్ ఈ స్టూడెంట్స్‌ని ప్రశంసించారు. యువత సృజనాత్మకత ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. వేస్ట్ టు బెస్ట్ అనే సూత్రానికి అనుగుణంగా వాహనాన్ని తయారు చేయడం బాగుందన్నారు. గుజరాత్‌లోని సూరత్ సిటీలోని భగవాన్ మహావీర్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఘనత సాధించారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×