E-Paper
Advertisement

లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. అధికార-విపక్షాల మాటల యుద్ధం.. వాడి వేడీగా సమావేశాలు

లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. అధికార-విపక్షాల మాటల యుద్ధం.. వాడి వేడీగా సమావేశాలు
Advertisement

Loksabha Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం వాటికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.

ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. సభలో బిల్లులను ప్రవేశ పెట్టిన కేంద్రం

Advertisement

చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకు తుది రూపం, డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంపు, పునర్విభజించేందుకు మూడు బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం.

ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన తర్వాత న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆయా బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీనిపై చర్చ మొదలైంది. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. 2024లో మహిళా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.

Advertisement

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేసీ వేణుగోపాల్.. కౌంటరిచ్చిన హోంమంత్రి అమిత్ షా

2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చామని ఈ సందర్భంగా సభ దృష్టికి ఆయన తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్నారు.  వెంటనే హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టకుండా ఎలా చర్చ చేపడతారని అన్నారు.

బిల్లు ప్రవేశపెట్టకుండానే ఎలా ప్రశ్నించారని ఎదురుదాడి చేశారు. సభలో బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత సభ్యులు తమ తమ అభిప్రాయాలను చెప్పవచ్చన్నవారు. ప్రజల్లో ఆందోళన కలిగించేలా విపక్షాలు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. జనగణన ఎందుకు చేపట్టలేదని ఎస్పీ ఎంపీ అఖిలేష్ ప్రశ్నిస్తున్నారని అన్నారు.

ALSO READ: అన్నట్టుగానే తమిళనాడులో.. డీలిమిటేషన్ పత్రాలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

 

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×