E-Paper
Advertisement

Cheetah: చిరుతా చిరుతా ఎందుకు చనిపోతున్నావ్?

Cheetah: చిరుతా చిరుతా ఎందుకు చనిపోతున్నావ్?
Advertisement
Cheetah

Cheetah: మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో చిరుతపులుల మృత్యువాత కొనసాగుతోంది. నాలుగు నెలల కాలంలో ఏకంగా ఎనిమిది చిరుత పులులు మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా సూరజ్‌ అనే మరో చిరుత మృతి చెందింది. రెండు రోజుల క్రితం తేజస్ అనే మగ చీతా మృతి చెందింది. సూరజ్ చిరుత ఎలా చనిపోయిందో ఇంతవరకు తెలియలేదు. ఆ చిరుత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిలో ఒకటైన తేజస్ అనే మగ చిరుత మంగళవారం మృతి చెందింది. అయితే ఈ చిరుత మెడపై గాయాలున్నాయి.

ప్రాజెక్ట్ చితాలో భాగంగా కేంద్రం రెండో దఫాల్లో దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి 20 చిరుతలను భారత్‌కు తీసుకొచ్చింది. అయితే ఇందులో ఆరు చిరుతపులులు ఇప్పటికే మృతి చెందాయి. మరో రెండు చిరుత పులుల పిల్లలు పుట్టగానే మరణించాయి. మార్చ్‌ 27న సాష, ఏప్రిల్‌ 23న ఉదయ్, మే 9న దక్ష, మే 25న అప్పుడే పుట్టిన రెండు చిరుత పులులు మృతి చెందాయి. ఇందులో కొన్ని అనారోగ్య కారణాలతో మృతి చెందగా.. మరికొన్ని పరస్పరం దాడులు చేసుకొని మృతి చెందాయి. ఇక రెండు చిరుత పిల్లలు మాత్రం వాతావరణం సహకరించకపోవడంతో మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

అయితే చిరుతపులుల మృతిపై దక్షిణాఫ్రికా వైల్డ్‌ లైఫ్‌ ఎక్స్‌పర్ట్‌ విన్సెంట్‌ ముందుగానే ఊహించారు. రానున్న రోజుల్లో మరికొన్ని చిరుతలు మృతి చెందుతాయని ఆయన ముందుగానే హెచ్చరించారు. నేషనల్ పార్క్‌లో చిరుత పులులు తమ సరిహద్దులను నిర్ణయించుకునే విషయంలో, పరస్పరం ఎదురుపడినప్పుడు జరిగే దాడుల్లో మృతి చెందుతాయని ఆయన తెలిపారు.

అయితే చిరుతపులులను సంరక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నేషనల్ పార్క్‌ అధికారులు చెబుతున్నారు. దేశంలో చిరుతపులుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించింది. గతేడాది సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మొదటి బ్యాచ్‌ చీతాలను కూనో నేషనల్ పార్క్‌లోకి వదిలారు. అయితే వరుసగా చిరుతల మృతితో కేంద్రం ఆశయానికి గండిపడుతుంది. వరుసగా చిరుత పులులు మృతి చెందడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×