E-Paper
Advertisement

Protestors: పారిశ్రామికవేత్త కోసం నిరసనకారులపై పోలీసుల కాల్పులు: మద్రాస్ హైకోర్టు

Protestors: పారిశ్రామికవేత్త కోసం నిరసనకారులపై పోలీసుల కాల్పులు: మద్రాస్ హైకోర్టు
Advertisement

Tuticorin: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో తూత్తుకుడిలో రాగి పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చేసిన ఘటనకు సంబంధించిన పిటిషన్ విచారిస్తూ పోలీసులపై మండిపడింది. 2018లో ప్రజాందోళన తీవ్రతరమయ్యాక పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మరణించారు. ఈ కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని ఓ సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు చేసిన సీబీఐ తీరును ఆక్షేపించింది. ఆ పారిశ్రామికవేత్త కోసమే ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నామని చెప్పింది.

తూత్తుకుడిలో స్టెరిలైట్ పరిశ్రమ పనులు చేపడితే.. తమ జీవితాలు, తమ భావితరాలు దుర్భరమవుతాయని స్థానికులు ఆందోళనలు చేశారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్య కారకాలు తమ జీవితాలను ఛిద్రం చేస్తాయని ఆరోపించారు. ఆ పరిశ్రమను మూసేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు తీవ్రంగా ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారినప్పుడు 2018 మే నెలలో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మరణించారు.

Advertisement

ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం మూసేసిన కేసును తిరిగి ఓపెన్ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త హెన్రి తిఫాగ్నే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎస్ఎస్ సుందర్, సెంథిల్ కుమార్ రామమూర్తిల డివిజన్ బెంచ్ విచారించింది. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగలేదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. పోలీసుల కాల్పులు ముందస్తుగా నిర్ణయించుకున్న చర్యగా తాము అనుమానిస్తున్నామని తెలిపింది. ఒక పారిశ్రామికవేత్త పక్షాన ఈ కాల్పులు జరిగాయని భావిస్తున్నామని పేర్కొంది.

Also Read: బీఆర్ఎస్‌లో మార్పులు, టీఆర్ఎస్ కండువాతో హరీష్‌రావు

Advertisement

అలాగే, రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టరేట్, యాంటీ కరప్షణ్ (డీవీఏసీ)‌కు ఈ డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాగి పరిశ్రమకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో ఆందోళనలు జరిగినప్పుడు అక్కడ విధులు నిర్వర్తించిన ఐపీఎస్, ఐఏఎస్ సహా అధికారులందరి ఆస్తిపాస్తులను దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×