E-Paper
Advertisement

Delhi Water Crisis: అతిషి దీక్షపై ఢిల్లీ బీజేపీ చీఫ్ తీవ్ర విమర్శలు!

Delhi Water Crisis: అతిషి దీక్షపై ఢిల్లీ బీజేపీ చీఫ్ తీవ్ర విమర్శలు!
Advertisement

Delhi Water Crisis: ఢిల్లీలో నీటి సంక్షోభానికి నిరసనగా మంత్రి అతిషి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షపై ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ విమర్శలు గుప్పించారు. మీడియా ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకే ఆమె వేదిక వద్ద ఉంటున్నారని అన్నారు. ఇదేం నిరాహార దీక్ష అని ఎద్దేవా చేశారు. అతిషి దీక్ష ఎయిర్ కండీషన్ సత్యాగ్రహం లాగా ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ డ్రామాలతో అతిషి ఢిల్లీ ప్రజలను మోసం చేయలేరని సచ్‌దేవ్ అన్నారు.

ఢిల్లీ మంత్రులు సత్యాగ్రహాలు, బెయిల్, జైలు, అవినీతిలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. అంతే కాకుండా మంత్రి నిరాహార దీక్షల గురించి మాట్లాడటం నవ్వు తెప్పిస్తుందని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చడమే మంత్రి పని. అతిషి రెండు గంటల పాటు నిరాహార దీక్ష వేదిక వద్ద కూర్చిని వేదిక వెనకాల ఎయిర్ కండిషన్ గదిలో 18 గంటలు ఉంటున్నారని అన్నారు. ఆప్ నేతలు అసమ్మతిని సహించలేరని తెలిపారు. ఢిల్లీ ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించలేరని అన్నారు.

Advertisement

Also Read: మాఫియా చేతుల్లో విద్యా వ్యవస్థ: ప్రియాంక గాంధీ

సత్యాగ్రహం అనేది మహాత్మ గాంధీ లాలాలజపతి రాయ్ వంటి నాయకులు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభించిన పవిత్రమైన ఉద్యమం అని అన్నారు. అలాంటి ఉద్యమాన్ని అతిషి ఐదు నక్షత్రాల ఉద్యమం చేశారని ఎద్దేవా చేశారు. ఫైవ్ స్టార్ సత్యాగ్రహం చేయడం ద్వారా అతిషి సత్యాగ్రహ ఉద్యమ పవిత్రతను అవమానించారని అన్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×