E-Paper
Advertisement

Modi : అమెరికాకు మోదీ పయనం.. టూర్ షెడ్యూల్ ఇదే..!

Modi :  అమెరికాకు మోదీ పయనం.. టూర్ షెడ్యూల్ ఇదే..!
Advertisement

Narendra Modi America Visit(Telugu breaking news today): ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మంగళవారం భారత్ నుంచి బయలుదేరారు. బుధవారం నుంచి యూఎస్ లో మోదీ అధికారిక పర్యటన మొదలవుతుంది. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌ తో వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. ముఖ్యంగా వాణిజ్యం ,పెట్టుబడులు, టెక్నాలజీ, టెలికాం, అంతరిక్షం, తయారీ రంగాలపైనా చర్చిస్తారు. విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ ఖ్వాత్రా ప్రధాని మోదీ అమెరికా పర్యటన వివరాలను వెల్లడించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం దిశగా భారత్‌, అమెరికాలు మరిన్ని ముందడుగులు వేయనున్నాయని తెలిపారు.

Advertisement

మోదీ అధికారిక పర్యటన జూన్ 21న న్యూయార్క్‌ నుంచి మొదలవుతుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీ పాల్గొంటారు. అక్కడ పలువురు ప్రముఖులను కలుస్తారు. అదే రోజు సాయంత్రం వాషింగ్టన్‌ చేరుకుంటారు. అక్కడ బైడెన్‌ దంపతులు ఇచ్చే విందులో పాల్గొంటారు. జూన్ 22న మోదీకి శ్వేతసౌధంలో బైడెన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సాయంత్రం అధికారిక విందుకు మోదీ హాజరవుతారు.

అమెరికా ప్రభుత్వం ఇచ్చే అధికారిక విందుకు 400 మంది అతిథులు హాజరయ్యే అవకాశముందని సమాచారం. ఇందులో ఇండియన్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్‌, రో ఖన్నా, శ్రీ థనేదార్‌ ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సీఈవోలు సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, ఫెడెక్స్‌ నుంచి రాజ్‌ సుబ్రమణియం విందుకు హాజరుకానున్నారు. జూన్ 23న కొందరు సీఈవోలతో భారత్ ప్రధాని భేటీ అవుతారు. ఆ తర్వాత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ ఇచ్చే విందులో పాల్గొంటారు.

Advertisement

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ప్రవాస భారతీయులు వాషింగ్టన్‌ లింకన్‌ మెమోరియల్‌ వద్ద ర్యాలీ చేపట్టారు.మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. హ్యూస్టన్‌లోని సుగర్‌లాండ్‌ మెమోరియల్‌ పార్కు వద్ద భారతీయ పతాకాలు రెపరెపలాడాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్‌ గేట్‌ వంతెన, న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

అమెరికా పర్యటన తర్వాత ప్రధాని మోదీ జూన్ 24న ఈజిప్టు వెళతారు.రెండు రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తారు. 11వ శతాబ్దం నాటి అల్‌ హకీం మసీదును సందర్శించనున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×