E-Paper
Advertisement

UP Political Crisis: నడ్డాతో డిప్యూటీ సీఎం భేటీ, సీఎం యోగిని మార్చుతున్నారా?

UP Political Crisis: నడ్డాతో డిప్యూటీ సీఎం భేటీ, సీఎం యోగిని మార్చుతున్నారా?
Advertisement

UP Political Crisis: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని బీజేపీ హైకమాండ్ మార్చే పనిలో ఉందా? అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య భేటీ వెనుక కారణమేంటి? యూపీలో ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత నాయకత్వాన్ని మార్చాలని కమలనాథులు ఆలోచిస్తున్నారా? ఇవే ప్రశ్నలు యూపీ కమలనాధులను వెంటాడుతున్నాయి.

లోక‌సభ ఎన్నికల ఫలితాలపై యూపీ బీజేపీలో తుపాను మొదలైనట్టు కనిపిస్తోంది. ఈసారి అక్కడ బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. దాని ప్రభావం యూపీ నేతలపై పడింది. ఇందులోభాగంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. మౌర్య ఒక్కరే సింగిల్ వెళ్లడంతో యూపీ బీజేపీలో చర్చ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల గురించి చర్చించే అవకాశమున్నట్లు ఢిల్లీ సమాచారం.

Advertisement

అంతకుముందు జేపీ నడ్డాతో యూపీ బీజేపీ ప్రెసిడెంట్ భూపేంద్రచౌదరి సమావేశమయ్యారు. ఇలా వరుస గా యూపీ బీజేపీ కీలక నేతలు నడ్డాతో సమావేశంకావడం పలు అనుమానాలు మొదలయ్యాయి. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చుతున్నారంటూ సంకేతాలు లేకపోలేదు. యూపీలోని త్వరలో 10 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల జరగనున్నాయి. దాని తర్వాత సీఎం యోగిని మార్చే ఛాన్స్ ఉందంటూ ఆ పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నమాట.

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉంది. ఈలోగా పార్టీలో అంతర్గత కలహాలపై బీజేపీ హైకమాండ్‌ ఫోకస్ చేసింది. సీఎం యోగి పనితీరు వల్లే లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా రాణించలేక పోయామన్నది అక్కడి నేతల వాదన. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి రావడానికి యూపీ కీలకంగా మారింది. ఈ క్రమంలో సీఎం యోగిని మార్చడం సరైన పద్దతికాదని అంటున్నారు. కాకపోతే ఉపఎన్నికల తర్వాత యోగి మంత్రివర్గాన్ని మార్చే అవకాశముందనే టాక్ లేకపోలేదు.

Advertisement

ALSO READ: భయపడ్డ సిద్ధరామయ్య సర్కార్.. ప్రైవేట్ జాబ్ కోటా బిల్ నిలిపివేత!!

మొత్తానికి లోక్‌సభ ఎన్నికలు బీజేపీలో చిన్నపాటి తుపాను చెలరేగిందనే చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి ఆ పార్టీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×