E-Paper
Advertisement

Dharmendra Pradhan: ఇంటర్నేషనల్ యోగా డే.. కేంద్ర మంత్రికి చేదు అనుభవం..

Dharmendra Pradhan: ఇంటర్నేషనల్ యోగా డే.. కేంద్ర మంత్రికి చేదు అనుభవం..
Advertisement

Dharmendra Pradhan Called Off his Event: ఇంటర్నేషనల్ యోగా డే రోజున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. యోగా డే వేడుకు ఢిల్లీ యూనివర్శిటీకి వచ్చిన ఆయనకు వ్యతిరేకంగా నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలపడంతో వేడుక రద్దు చేసుకుని వెనుదిరిగారు.

యోగా డే సందర్భంగా ఢిల్లీ యూనివర్శిటీలోని వేడుకలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరవ్వడానికి వస్తుండగా విద్యార్థులు ఆయనకు నల్ల జెండాలు ప్రదర్శించారు. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), యూజీసీ-నెట్‌కు సంబంధించిన ఇటీవలి కుంభకోణాలపై వారు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. దీంతో చేసేదేమిలేక మంత్రి వెనుదిరిగారు.

Advertisement

కాగా గురువారం ధర్మేంద్ర ప్రధాన్ యూజీసీ నెట్ పేపర్ లీకేజీ అంశంపై స్పందించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థాగత వైఫల్యంగా పేర్కొన్నారు. ఎన్టీయే పనితీరును పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తుందని అన్నారు. అలాగే వ్వవస్థలో అవసరమయ్యే సంస్కరణలను సిఫార్సు చేస్తుందని అన్నారు. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్, యూజీసీ-నెట్ రద్దుపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×