E-Paper
Advertisement

Dharmendra pradhan: విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు: ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra pradhan: విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు: ధర్మేంద్ర ప్రధాన్
Advertisement

Dharmendra pradhan: నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియా సమావేశం నిర్వహించారు. నీట్ పరీక్షతో పాటు యూజీసీ నెట్ పరీక్ష రద్దు విషయాలపై విపక్షాల చేస్తున్న ఆరోపణల గురించి ఆయన మాట్లాడారు. నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఆధారాలు లభిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్టీఏలోని ఎవరైనా ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరని అన్నారు. దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని కోరారు. నీట్ పేపర్ లీక్ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు.

Advertisement

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కాం.. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు..

విద్యార్థులే మన భవిష్యత్తు.. నీట్ గురించి పుకార్లు వ్యాప్తి చేయవద్దని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రశ్నా పత్రాల లీకేజీకి సంబంధించి పట్నా పోలీసులు పూర్తి స్థాయి నివేదిక అడిగినట్లు వెల్లడించారు. ఎన్టీఏ పరీక్ష విధానం మెరుగుపరిచేందుకు జీరో ఎర్రర్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×