E-Paper
Advertisement

Cabinet Meet: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..

Cabinet Meet: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..
Advertisement

Cabinet Meet: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యంత కీలక సమావేశం జరగనుంది. ఢిల్లీ బ్లాస్ట్‌పై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. నిన్న భూటాన్ పర్యటనలో మాట్లాడిన మోడీ.. ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాద శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.

నిందితులు ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదని మోదీ హెచ్చరిక..
దేశ భద్రతను కించపరచే కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామన్నారు. నిందితులు ఎక్కడ దాక్కున్నా వారిని వెంబడించి పట్టుకుంటామని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ముమ్మరంగా పనిచేస్తున్నాయని.. ఈ ఉగ్రకుట్ర వెనుక ఉన్న ప్రతి సంబంధాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. దేశ భద్రత, ప్రజల ప్రాణరక్షణ విషయంలో రాజీకి తావు ఉండదని పేర్కొన్నారు.

Advertisement

నేడు ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..
దేశ ఆర్థిక, సామాజిక ఎజెండాను దృష్టిలో ఉంచుకుని ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల రంగంలో మూలధన పెట్టుబడిని పెంచడం, కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంపై కేంద్రం దృష్టి సారించనుంది. దీంతోపాటు, వివిధ కేంద్ర పథకాల విస్తరణ ప్రణాళికలపైనా చర్చ జరగనుంది. సామాన్య ప్రజలను ప్రభావితం చేసే ధరల స్థిరీకరణ చర్యలు ఎజెండాలో ఉన్నాయి. నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మంత్రివర్గం సమీక్షించనుంది.

Also Read: కాలుష్యం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఢిల్లీ విద్యార్థులకు పండగే పండుగ

Advertisement

శీతాకాల సమావేశాల కోసం, కొత్త బిల్లులు, ముఖ్యమైన ఆర్డినెన్స్‌ల ముసాయిదాలపై చర్చ..
రైతు సంక్షేమం, పంటల కొనుగోలు విధానాలు, రబీ సీజన్‌కు సంబంధించిన అంశాలపైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం, కొత్త బిల్లులు, ముఖ్యమైన ఆర్డినెన్స్‌ల ముసాయిదాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×