E-Paper
Advertisement

Decisions by Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు..

Decisions by Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు..
Advertisement

Decisions by Union Cabinet: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దేశ భద్రత, విమానయాన రంగం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం భారీ కేటాయింపులు చేపట్టింది. ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఇమ్మిగ్రేషన్, వీసా, విదేశీయుల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ (IVFRT) ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విదేశీయుల రాకపోకలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 1800 కోట్ల రూపాయల ఖర్చుకు అనుమతి నిచ్చింది. దీనివల్ల వీసా ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు, అక్రమ చొరబాట్లను అరికట్టడం సులభతరం అవుతుంది.

Advertisement

సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత చేరువ చేసేందుకు UDAN 2.0 పథకానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. పదేళ్ల వ్యవధిలో ఈ పథకం కోసం 28,840 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగాకొత్తగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు.

దేశవ్యాప్తంగా 200 హెలిప్యాడ్‌లను అత్యాధునిక హంగులతో ఆధునీకరిస్తారు. ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ (VGF) కింద 10,043 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది.ఈ పథకం ద్వారా కొత్తగా మరో 120 ప్రాంతాలకు విమాన సర్వీసులు విస్తరించనున్నాయి.

Advertisement

పర్యావరణ పరిరక్షణ కోసం ‘నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్’ (NDC) విధానానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భాగంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే కాలంలో దేశ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 52 శాతం వాటాను పునరుత్పాదక ఇంధన వనరుల నుండే సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read Also: Rythu Bharosa: పీఎం కిసాన్ దారిలో రైతు భరోసా.. నిధుల జమ మార్పుపై క్లారిటీ ఇవ్వని సర్కార్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×