E-Paper
Advertisement

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?
Advertisement

Chennai News: తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనను అనుకూలంగా మార్చుకునే పనిలో మిగతా పార్టీలు పడ్డాయా? విజయ్‌ని అరెస్ట్ చేయాలని అధికార డీఎంకె, అన్నాడీఎంకె నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. దీనిపై నమ్మకం లేని టీవీకె పార్టీ,  మద్రాసు హైకోర్టు తలుపు తట్టింది.

కరూర్‌లో టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 39 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై స్టాలిన్ సర్కార్ ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్ న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ ఆదివారం మధ్యాహ్నం కరూర్‌కి వస్తుందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.  దీనిపై టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేసింది.

Advertisement

ఈ ఘటన తొక్కిసలాట వల్ల జరిగిందని కాదని, ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని బలంగా నమ్ముతోంది. పోలీసులు సరై ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో విజయ్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులు లాఠీఛార్జ్ వల్లే ఘటన జరిగిందని వాదిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది టీవీకే పార్టీ. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisement

ALSO READ:  పార్టీ తరపున మృతులకు రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా

టీవీకే నిర్ణయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.  ఆదివారం ఉదయం అధినేత విజయ్.. పార్టీ నేతలతో ఆన్‌లైన్ సమావేశం ఏర్పాటు చేశారు.  దీనిపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారట. తొక్కిసలాట ఘటన జరిగే అవకాశముందని కొద్దిరోజుల కిందట సోషల్‌మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టిన విషయాన్ని అధినేత దృష్టికి తెచ్చారట.  ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారట.

ఈ నేపథ్యంలో హైకోర్టు తలుపు తట్టిందని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ సమయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని పార్టీల నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి కరూర్ ఘటన తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి.

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×