E-Paper
Advertisement

Trek Accident: హిమాలయాల్లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 9మంది బెంగళూరు వాసులు మృతి

Trek Accident: హిమాలయాల్లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 9మంది బెంగళూరు వాసులు మృతి
Advertisement

Trek Accident:ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లిన బృందం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొలుత నలుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మృతులంతా బెంగళూరు వాసులుగా గుర్తించారు. మొత్తం 22 మందితో కూడిన ట్రెక్కింగ్ బృందం మే 29న హిమాలయాల్లోని 4,400 మీటర్ల ఎత్తున ఉన్న సహస్త్రతాల్ సరస్సు వద్దకు బయలుదేరారు. ట్రెక్కింగ్ పూర్తి చేసుకున్న ఈ బృందం తిరిగి బేస్ క్యాంప్ వద్దకు చేరుకోలేదు. దీంతో ట్రెక్కింగ్ ఏజెన్సీ అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సమాచారం అందించారు.

13మందిని కాపాడారు..

Advertisement

ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సహాయక చర్యలు చేపట్టింది. మొత్తం 22 మందిలో 9 మంది మృతి చెందగా.. ఇప్పటికే చిక్కుకున్న 13మందిని కాపాడారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 19 మంది, మరో ముగ్గురు స్థానిక గైడ్స్‌తో కలిసి ఉత్తరకాశీ నుంచి హిమాలయ పర్వతాల్లోని సహస్త్రతాల్ సరస్సు ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీంతో మాట్లాడుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కాగా, ఇప్పటికే మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×