E-Paper
Advertisement

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
Advertisement

Goods carrier derails near Mathura in Uttar Pradesh: దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో రైలు ప్రయాణం అంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రయాణిస్తున్నారు. గత కొంతకాలంగా రోజూ ఏదో ఒకచోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది కావాలని దాడులు చేస్తుండగా.. మరోవైపు సాంకేతిక లోపం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని రాత్రి 8 గంటలకు ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

వివరాల ప్రకారం.. యూపీలోని బృందావన్ రోడ్ స్టేషన్ సమీపంలో ఓ బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్స్ రైలుకు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గూడ్స్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే దాదాపు 20కు పైగా బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

Advertisement

సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆ రూట్‌ను క్లియర్ చేసేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

యూపీలోని బృందావన్ రోడ్ సమీపంలో గూడ్స్ రైలుకు చెందిన 20 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఢిల్లీ- మథుర మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని నేషనల్ క్యాపిటల్ రీజియన్ రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆ మార్గాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టారు.

Advertisement

Also Read: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

ఇదిలా ఉండగా, ఇటీవల భోపాల్ సమీపంలోని మిస్రోడ్, మండిదీప్ రైల్వే స్టేషన్ల మధ్య ఓ గూడ్స్ రైలుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోనే మరో ప్రమాదం జరగడంతో పలు అనుమానులు వ్యక్తమవుతున్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×