E-Paper
Advertisement

Popular Museums in India : మనదేశపు మేలైన మ్యూజియాలు..!

Popular Museums in India : మనదేశపు మేలైన మ్యూజియాలు..!
Advertisement
Museums in India

Museums in India (today’s latest news):

జాతి సంస్కృతిని, ప్రాచీన వైభవాన్ని చాటిచెప్పే వేదికలే మ్యూజియాలు. మనదేశంలో దేశం నలుమూలల్లో ఉన్న అలాంటి చూడదగిన అయిదు ముచ్చటైన మ్యూజియాలు ఇవే.

Advertisement

ఇండియన్‌ మ్యూజియం, కోల్‌కతా
దేశంలోని అతి పెద్ద మ్యూజియం ఇది. 1814లో కోల్‌కతాలో ప్రారంభమైన ఈ ప్రాచీన మ్యూజియం.. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని అతిపెద్ద రిఫరల్ మ్యూజియంగా గుర్తింపు పొందింది. ఇక్కడి 35 గ్యాలరీలలో నిర్మాణపరంగా అచ్చెరువొందే కళాఖండాలు, పురాతన అవశేషాలు, నాటి పాలకులు వాడిన కవచాలు, అభరణాలు, మమ్మీలు, మొఘలుల చిత్రలేఖనాలున్నాయి. సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మూసి ఉంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 20

నేషనల్‌ మ్యూజియం, ఢిల్లీ
స్వాతంత్ర్యానికి పూర్వం లండన్‌ రాయల్‌ అకాడమీ వారు బర్లింగ్‌టన్‌ హౌస్‌లో ఓ మ్యూజియాన్ని నిర్వహించారు. భారత్‌ నుంచి సేకరించిన అరుదైన కళాఖండాల ప్రదర్శన విజయవంతం కావటంతో, వీటినే తర్వాతి రోజుల్లో రాష్ట్రపతి భవన్‌లోనూ ప్రదర్శించారు. సుమారు 2 లక్షల ఈ కళాఖండాలను నేషనల్ మ్యూజియం పేరుతో ఏర్పరచారు. 5వేల ఏళ్లనాటి మన సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ మ్యూజియం జనపథ్ సమీపంలో ఉంది. సోమవారం సెలవు. టిక్కెట్టు ధర పెద్దలకు రూ. 20.

Advertisement

సాలార్‌జంగ్‌ మ్యూజియం, హైదరాబాద్‌
హైదరాబాద్‌లో మూసీనది ఒడ్డున గల ఈ మ్యూజియం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 43వేల కళాఖండాలు, 50 వేల పుస్తకాలు, రాత ప్రతులున్న ఈ మ్యూజియం భారతీయ, పర్షియన్, యూరోపియన్ శైలికి సంబంధించిన కళాఖండాలే గాక మమ్మీలు, నూర్జహాన్‌, షాజహాన్‌, ఔరంగజేబు వంటి చక్రవర్తులు వాడిన ఆయుధాలు ఉన్నాయి. పబ్లిక్ హాలిడే, శుక్రవారం రోజుల్లో మూసి ఉంటుంది. టికెట్ ధర: 20

బీహార్‌ మ్యూజియం, పాట్నా
స్వాతంత్ర్య సంగ్రామానికి చెందిన అనేక విశేషాలను 1917లో స్థాపించిన ఈ మ్యూజియంలో చూడొచ్చు. ముఖ్యంగా మౌర్యులు, గుప్తుల కాలం నుంచి 18వ శతాబ్దపు చరిత్ర వరకు వివరించే అనేక కళాఖండాలు, ఆయుధాలు, చిత్రపటాలున్నాయి. సోమవారం సెలవు. టికెట్ ధర.. పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ. 20.

ఇండో-పోర్చుగీస్‌ మ్యూజియం, కొచ్చి
కేరళలోని కొచ్చిలోని ఈ మ్యూజియం ఆ ప్రాంతంపై పోర్చుగీసుల చారిత్రక, సాంస్కృతిక ప్రభావాన్ని తెలియజెబుతుంది. 5 విభాగాలుగా ఉండే ఈ మ్యూజియంలోని కళాఖండాలలో ఎక్కువగా పోర్చుగీసు పాలనలో నిర్మించిన చర్చిల నుంచి సేకరించినవే. సోమవారం సెలవు. టికెట్ ధర పెద్దలకు రూ. 10, పిల్లలకు రూ. 5. ప్రతినెలా మొదటి గురువారం అందరికీ ప్రవేశం ఉచితం.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×