E-Paper
Advertisement

DK Sivakumar: ఆ 140 మంది ఎమ్మెల్యేలు నా వాళ్లే.. సీఎం మార్పుపై డీకే క్లారిటీ

DK Sivakumar: ఆ 140 మంది ఎమ్మెల్యేలు నా వాళ్లే.. సీఎం మార్పుపై డీకే క్లారిటీ
Advertisement

DK Sivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై కొనసాగుతున్న ప్రచారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. సిద్ధరామయ్య ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన తేల్చి చెప్పారు. తామంతా సిద్ధరామయ్యకు పూర్తిగా సహకారం అందిస్తామని డీకే శివకుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పుపై తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలను డీకే శివకుమార్ ప్రకటనతో ఉపశమనం లభించింది.

డీకే శివకుమార్ ట్వీట్ ద్వారా కీలక విషయాలు వెల్లడించారు. తాను ఎప్పుడూ గ్రూపు రాజకీయాలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ‘140 మంది నా ఎమ్మెల్యేలే. ఒక గ్రూపును ఏర్పాటు చేయడం నా రక్తంలో లేదు’ అని ఆయన పేర్కొన్నారు. సీఎం కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నారు అని డీకే తెలిపారు. మంత్రి పదవి కావాలనుకున్న నేతలంతా ఢిల్లీకి వెళ్లారు అని ఆయన వివరించారు. సిద్ధరామయ్య ఐదేళ్లు సీఎంగా పనిచేస్తారని డీకే శివకుమార్ చెప్పారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి తాను హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డీకే శివకుమార్ ప్రకటించారు. ఈ ప్రకటన కర్ణాటక కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించింది.

Advertisement

కొన్ని రోజులుగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తప్పదనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పంచాయితీ కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లింది. అయితే అధిష్టానం జోక్యంతో డీకే శివకుమార్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. హైకమాండ్ సూచన మేరకు డీకే శివకుమార్ ఈ ప్రకటన చేశారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రకటనతో కర్ణాటకలో నాయకత్వ సమస్యకు తాత్కాలికంగా ముగింపు పడినట్లు కనిపిస్తోంది.

డీకే శివకుమార్ చేసిన ఈ ప్రకటనతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా పనిచేయడానికి మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న అనవసర ప్రచారానికి పుల్‌స్టాప్ పడింది. కర్ణాటక అభివృద్ధికి తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని డీకే శివకుమార్ తన మాటల ద్వారా సంకేతాలు ఇచ్చారు.

Advertisement

ALSO READ: IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు.. కీలక బాధ్యతల్లో కొత్త అధికారుల నియామకం

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×