E-Paper
Advertisement

America : అమెరికాలో మరోసారి కాల్పులు.. టెక్సాస్ లో ఒకరు మృతి..

America : అమెరికాలో మరోసారి కాల్పులు.. టెక్సాస్ లో ఒకరు మృతి..
Advertisement

America : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. తాజాగా టెక్సాస్ లో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో అనుమానితుడి కోసం గాలిస్తున్నారు.టెక్సాస్ లోని ఓ మాల్‌లో తుపాకీ కాల్పుల ప్రారంభం కాగానే అందులో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు.

Advertisement

గతేడాది మేలో టెక్సాస్‌లో 18 ఏళ్ల యువకుడు ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం ఈస్ట్‌ లాన్సింగ్‌లోని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు.

అమెరికాలో తరచూ కాల్పుల ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులు తుపాకీ గుళ్లకు బలవుతున్నారు. విదేశాల నుంచి అమెరికాకు వచ్చి ఉపాధి పొందుతున్న వారు కాల్పుల ఘటనల్లో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అమెరికాలో గన్ కల్చర్ ఎంతో మంది భారతీయుల ప్రాణాలను బలి తీసుకుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×