E-Paper
Advertisement

Wayanad landslides: మీ సేవలు మరిచిపోలేము.. వయనాడ్‌లో జవాన్‌లకు కన్నీటి వీడ్కోలు

Wayanad landslides: మీ సేవలు మరిచిపోలేము.. వయనాడ్‌లో జవాన్‌లకు కన్నీటి వీడ్కోలు
Advertisement

Wayanad landslides: కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు కూలిన ఘటనలో 400 మందికి పైగా మరణించారు. ఇంకా 152 మంది ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. ఇక ఈ విపత్తు చోటు చేసుకున్న రోజు నుంచి దాదాపు 10 రోజుల పాటు భారత సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంది. నేటితో వారి సహాయక చర్యలు ముగియడంతో వారికి వయనాడ్ ప్రజలు వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వయనాడ్‌లో ప్రకృతి విపత్తు జరిగిన రోజు నుంచి ఆర్మీ జవాన్లు ఎంతో శ్రమించి శిథిలాల్లో చిక్కుకున్న  చాలా మందిని రక్షించారు. అంతే కాకుండా చనిపోయిన వారి మృత దేహాలు కూడా బయటకు తీసారు. సాహసోపేతంగా వారు బాధితులను రక్షించిన తీరు అందరి మదిలో నిలిచిపోయింది. అంతే కాకుండా తక్కువ సమయంలోనే వంతెన నిర్మించి దేశ ప్రజల మన్ననలను కూడా అందుకున్నారు. వయనాడ్ ప్రజలకు కూడా వీరు ఎంతో సేవ చేశారు.

Advertisement

Also Read: అఖిలేష్ Vs అమిత్ షా.. దద్దరిల్లిన లోక్‌సభ

ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా సరే ఓడ్చి బాధితులకు బాసటగా నిలిచారు. ఇదిలా ఉంటే నేటితో వారి సహాయక చర్యలు ముగియడంతో జవాన్లు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఈ సందర్భంగా జవాన్లు వీడ్కోలు పలుకుతూ వయనాడ్ ప్రజలు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. జవాన్లు తిరిగి వెళుతుండగా అక్కడికి వచ్చిన వారంతా ఉద్వేగానికి గురయ్యారు. తమకు ఎంతగానో సాయం చేశారు అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×