E-Paper
Advertisement

Gujarat : ముఖ్యమంత్రి ప్రసంగం.. అధికారి కునుకు.. ఆ తర్వాత ఏమైంది..?

Gujarat : ముఖ్యమంత్రి ప్రసంగం.. అధికారి కునుకు.. ఆ తర్వాత ఏమైంది..?
Advertisement

Gujarat : రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీసిన ఓ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ భుజ్ లో పర్యటించారు. 2001లో సంభవించిన పెను భూకంప బాధితుల పునరావాసం కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

Advertisement

ఆ తర్వాత సీఎం భూపేంద్ర పటేల్ ప్రసంగించారు. ఆ సమయంలో సభలో కూర్చున్న ఓ అధికారి నిద్రపోయారు. ఆ ఆఫీసర్ కునుకు తీసిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ అధికారిని భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ గా గుర్తించింది.

సీఎం సభలో నిద్రపోయిన అధికారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. గంటల వ్యవధిలోనే రాష్ట్ర పట్టణాభివృద్ధి విభాగం ఆ అధికారిని విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించారని పేర్కొంది. నిబంధనల ప్రకార జిగర్ పటేల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా ముఖ్యమంత్రి కార్యక్రమంలో నిద్రపోయి ఆ అధికారి సస్పెన్షన్ కు గురయ్యారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×