E-Paper
Advertisement

Terrorists: ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Terrorists: ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Terrorists: ఉగ్రవాదులపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్‌గా ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామని అన్నారు. లేకుంటే నేరుగా నరకానికే పంపిస్తామని హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. జమ్ము కశ్మీర్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులను జైలుకు పంపుతాం అని అన్నారు. లేకుంటే నరకానికే పంపిస్తాం అని హెచ్చరించారు ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేస్తామని తెలిపారు. అంతే కాకుండా జమ్ము కశ్మీర్‌లో గత కొద్ది రోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు.

Advertisement

అదే విధంగా జమ్మూ కశ్మీర్‌లో గత కొద్దిరోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. ఈ దాడుల్లో కొందరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని మంత్రి వివరించారు. 2019లో ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు హిల్ స్టేట్ లో భద్రతా బలగాలు దాదాపు 900 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు. ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా మంత్రి ఈ సందర్భంగా మండిపడ్డారు. 2004-2014 లో యూపీఏ ప్రభుత్వ హయాంలో జమ్మూకాశ్మీర్‌లో 7217 ఉగ్రవాదులు ఘటనలు జరిగాయని మంత్రి తెలిపారు ఆ దాడుల్లో 2,829 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు, అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 67 శాతానికి తగ్గిందని అన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×