E-Paper
Advertisement

Bilkis Bano Case : “ఆదివారం నాటికి లొంగిపోవాలి”.. బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం ఆదేశాలు..

Bilkis Bano Case : “ఆదివారం నాటికి లొంగిపోవాలి”.. బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం ఆదేశాలు..
Advertisement

Bilkis Bano Case : బిల్కిస్‌బానో కేసు( Bilkis Bano case)లో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లొంగిపోవడానికి మరింత సమయం కావాలంటూ వారు వేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. వాటికి విచారణార్హత లేదని, ఆదివారం నాటికి వారంతా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు అదేశాలు జారి చేసింది.

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు.. బిల్కిస్‌ బానో ఐదు నెలల గర్భిణిగా ఉన్నారు. ఆ సమయంలో బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఈ కేసులో 11 మంది దోషులు 15 ఏళ్లు జైల్లో గడిపారు. దోషులకు గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేసింది. దీంతో 2023 ఆగస్టు 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు.

Advertisement

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. దోషుల విడుదల చెల్లదని జనవరి 8న తీర్పునిచ్చింది. వారంతా రెండు వారాల్లో జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. అయితే, తమకు కొన్ని కుటుంబ బాధ్యతలున్నాయని, లొంగిపోయేందుకు మరింత సమయం కావాలంటూ వారు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×