E-Paper
Advertisement

kumbh mela: కుంభమేళాలో టాప్ బిజినెస్ ఇదే.. లక్షల్లో లాభాలు..

kumbh mela: కుంభమేళాలో టాప్ బిజినెస్ ఇదే.. లక్షల్లో లాభాలు..
Advertisement

kumbh mela: కుంభమేళాలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం. ఎందరో సత్పురుషులను ఒకే చోట దర్శించే భాగ్యం కలగడం కూడ పుణ్యఫలమే. ఈ నేపథ్యంలో 144 ఏళ్ల తర్వాత జరిగే కుంభమేళాలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. అయితే ఇక్కడ జరిగే ఓ వ్యాపారం మాత్రం పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ అనే రేంజ్ లో సాగుతుందట. కుంభమేళాలో 40 కోట్ల మంది వరకు భక్తులు పాల్గొంటున్న నేపథ్యంలో, ఈ వ్యాపారం మాత్రం అక్కడ జోరుగా సాగుతుందని వ్యాపారులు తెగ ఆనంద పడిపోతున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. వచ్చేనెల 26 మహా శివరాత్రి నాడు ముగుస్తుంది. ఇప్పటికీ 6 రోజులు పూర్తి చేసుకున్న కుంభమేళాలో భక్తుల రాక రోజురోజుకు పెరుగుతోంది. ఎటు చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది. ఎందరో నాగ సాధువులు, అఘోరాలు తమ ఆవాసాలలో ఉంటూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు దేశ విదేశాల నుండి వస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందట.

Advertisement

ఇంతకు ఆ వ్యాపారం ఏమిటో తెలుసా.. వేప పుల్లల వ్యాపారం. పూర్వం వేప పుల్లలు దంతాలను శుభ్రపరచుకోవడం కోసం ఉపయోగిస్తారు. నేటికీ కొన్ని గ్రామాలలో ఇదే పరంపర సాగుతోంది. అయితే కుంభమేళాకు భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో స్థానికులు, కొందరు భక్తులు వేప పుల్లల వ్యాపారం ప్రారంభించారు. ఒక కట్ట వేపపుల్లలు రూ. 10 వేలకు కొనుగోలు చేసి, సుమారు లక్ష వరకు ఆదాయం పొందుతున్నారట వ్యాపారులు. 6 అడుగుల వేపపుల్ల రూ. 10 రూపాయలకు విక్రయిస్తున్నారు.

Also Read: Viral News: ఆమెకు 19 మంది సంతానం.. అయితేనేమి రికార్డ్ బద్దలు కొట్టింది

Advertisement

కుంభమేళాకు వచ్చిన ప్రతి భక్తుడు తప్పక దంత శుద్ధి పాటిస్తారు. అందుకే టూత్ పేస్ట్ కంటే వేప పుల్ల మేలని, ప్రకృతి వరప్రసాదిని వేపచెట్టు పుల్లలతో దంత శుద్ధి బహుబాగు అంటూ వ్యాపారులు కేకలు వేస్తూ మరీ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. భక్తులు కూడ వేపపుల్లలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, 45 రోజుల పాటు సాగే కుంభమేళా తమకు భక్తిపారవశ్యంతో పాటు ఉపాధి కూడ చూపిందని స్థానికులు, వేప పుల్లల వ్యాపారులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 40 కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యాపారస్తుల సంఖ్య కూడ రోజురోజుకు అంతేస్థాయిలో పెరుగుతుందట. మరి కుంభమేళాలో పాల్గొన్నారా.. అక్కడ వేప పుల్లను ఎన్ని రూపాయలకు కొనుగోలు చేశారో కామెంట్ చేయండి!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×