E-Paper
Advertisement

Kerala : రేపు కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు.. గతేడాది కంటే ఆలస్యం..

Kerala : రేపు కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు.. గతేడాది కంటే ఆలస్యం..
Advertisement

Kerala : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించనున్నాయి. శుక్రవారానికల్లా కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ ప్రకటించింది. రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు వీస్తున్నాయి.

గతేడాది జూన్‌ ఒకటినే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కానీ ఈ ఏడాది వారం రోజులపైగా ఆలస్యంగా వస్తున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. ఇది జూన్‌ 5న ఏర్పడింది. బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని అంచనా వేస్తున్నారు.

Advertisement

రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించనున్నాయి. అరేబియా సముద్రం, లక్షద్వీప్, మాల్దీవులు, కొమరిన్‌ ప్రాంతాలు, నైరుతి, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ప్రవేశానికి అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ తెలిపింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×