E-Paper
Advertisement

Monsoon: చల్లని కబురు..ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు

Monsoon: చల్లని కబురు..ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
Advertisement

Monsoon Update: దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. జూన్ ఒకటో తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవులు, పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

జూన్ 15 నాటికి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందే వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. గత వారం ఐఎండీ జూన్ ఒకటి లేదంటే.. మే 27 న కేరళ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

Advertisement

రుతుపవనాలు అండమాన్ మీదుగా కేరళను తాకుతూ వర్షాలను కురిపిస్తూ ముందుకు వెలతాయని పేర్కొంది. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాల సీజన్ కొనసాగుతుంది. గతేడాది ఆలస్యంగా జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ ఏడాది సాధారణంగా జూన్ ఒకటి కంటూ ముందే కేరళను రుతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Also Read: తీహార్ జైలుకు బాంబు బెదిరింపు.. ఢిల్లీలో హైఅలర్ట్

Advertisement

రుతుపవనాల సీజన్ లో వర్షాపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఎల్ పీఏలో 106 శాతం వరకు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. కానీ గతేడాది ఎల్ పీఏలో 94.4 శాతం వర్షాపాతం మాత్రమే నమోదు చేసింది. నైరుతి రుతుపవనాల కదలికలపై ఎప్పటికప్పుడు సామాచారం అందిస్తామని ఐఎండీ పేర్కొంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×