E-Paper
Advertisement

Sharad Pawar NCP: శరద్ పవార్ ఎన్సీపీ వర్గానికి కొత్త సింబల్.. కేటాయించిన ఎన్నికల సంఘం..

Sharad Pawar NCP: శరద్ పవార్ ఎన్సీపీ వర్గానికి కొత్త సింబల్.. కేటాయించిన ఎన్నికల సంఘం..
Advertisement
Sharad Pawar NCP Alloted New Party Symbol

EC Alloted Party Symbol to Sharad Pawar NCP: శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కొత్త గుర్తును గురువారం కేటాయించింది. ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గానికి “మ్యాన్ బ్లోయింగ్ తుర్హా” గుర్తును కేటాయించారు.

“వారి అభ్యర్థన మేరకు, మహారాష్ట్రలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలలో “మ్యాన్ బ్లోయింగ్ తుర్హా” గ్రూప్/పార్టీకి కేటాయించాం” అని ఎన్నికల సంఘం తన ప్రకటనలో తెలిపింది.

Advertisement

ఫిబ్రవరి 6న కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ గుర్తు ‘వాల్ క్లాక్’ను కేటాయించింది. దీంతో ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Read More: ‘పార్టీ గుర్తు కాదు.. సిద్ధాంతాలు ముఖ్యం’.. ఎన్నికల కమిషన్‌పై మండిపడిన షరద్ పవార్

Advertisement

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరిన తర్వాత, 2023 జూలై నుంచి మామ, మేనల్లుడు మధ్య దూరం పెరిగింది. ఇది ఎన్‌సీపీలో చీలికకు కారణమైంది.

ఫిబ్రవరి 21న అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీ అనర్హత పిటిషన్‌పై బాంబే హైకోర్టు ఎన్‌సీపీలోని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు, మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 14న కోర్టు వాయిదా వేసింది.

శరద్ పవార్ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకుండా స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీఫ్ విప్ అనిల్ భాయిదాస్ పాటిల్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఇటీవలి ఉత్తర్వులను రద్దు చేయాలని, అది చట్టపరంగా లోపభూయిష్టంగా ప్రకటించాలని, మొత్తం 10 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని పాటిల్ కోర్టును అభ్యర్థించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×