E-Paper
Advertisement

Akshilesh Yadav : కులగణనపై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు.. కూటమిలో ఆందోళన

Akshilesh Yadav : కులగణనపై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు.. కూటమిలో ఆందోళన
Advertisement

Akshilesh Yadav : సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీరు ఇండియా కూటమిలో ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలు CASTE సెన్సెస్(కులగణన) పై ప్రజలను మోసం చేశాయని అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు CASTE సెన్సెస్ అడుగుతోంది కానీ.. గతంలో మాత్రం చిత్తశుద్దిని చూపించలేదని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో CASTE సెన్సెస్ జరిపినా.. ఆ వివరాలు బయటపెట్టలేదని విమర్శించారు. అయితే, వెనబడిన వర్గాలు హస్తం పార్టీకి దూరమయ్యారని అన్నారు. అందుకే, ఈ పార్టీకి ఇప్పుడు తత్వం బోధపడిందని అభిప్రాయపడ్డారు.

దూరం చేసుకున్న ఓటు బ్యాంక్ ను తిరిగి సాధించుకోవడానికే కాంగ్రెస్ CASTE సెన్సెస్ జరపాలని అడుగుతున్నారని అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. వరుసగా ఇలాంటి కామెంట్స్ తో అఖిలేష్ హాట్ టాపిక్ గా మారుతున్నారు. నిన్న, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ సీట్ల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సీట్ల పంపిణీలో కాంగ్రెస్ తమను మోసం చేసిందని అన్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని అఖిలేష్ భావించారు. ఇందులో భాగంగా తమకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని అడిగారు. అయితే కాంగ్రెస్.. అఖిలేష్ ప్రతిపాదనను పక్కన పెట్టి.. అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఇలాంటి ధోరణితో.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఇండియా కూటమికి సాధ్యం కాదని అఖిలేష్ మండిపడ్డారు. కలిసి పోటీ చేయడం ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇలాగే వ్యవహరిస్తే.. వారితో ఎవరు నిలబడరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో 18 మందిని సమాజ్ వాది పార్టీ తరుపున బరిలో దించుతామని అన్నారు. మధ్యప్రదేశ్ టికెట్లపై మాట్లాడి 24 గంటలు అవ్వకముందే CASTE సెన్సెస్ పై హాట్ కామెంట్స్ చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×