E-Paper
Advertisement

Sabarimala Gold Theft Case: శబరిమల బంగారం చోరి కేసులో బిగ్‌ట్విస్ట్.. ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్!

Sabarimala Gold Theft Case: శబరిమల బంగారం చోరి కేసులో బిగ్‌ట్విస్ట్.. ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్!
Advertisement

Sabarimala Gold Theft Case: శబరిమల అంటే కేరళ వాసులకు ఎలాంటి నమ్మకాలున్నాయో తెలీదు. కానీ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ నమ్మకాల ఉధృతి చాలా చాలా ఎక్కువ. ఇక్కడ అయ్యప్ప అంటే, అంతదూరంలో ఉన్న స్వామి వారి సందర్శనకు పాదయాత్రగా నడిచి వెళ్లే భక్తులుంటారు. అంతగా స్వామివారి పట్ల తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు.

కొన్ని రోజుల పాటు- వందలాది మంది- వేల కిలోమీటర్ల మేర నడచి స్వామివారి దర్శనం చేస్తే ఆ పుణ్యమే వేరని భావిస్తారు. తెలుగువారి ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్నారు శబరిగిరీశుడు. భక్తజనుల కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు. ఆ నియమ నిష్టలు చూస్తే ఎవరికైనా సరే, ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది.

Advertisement

నలభై ఒక్క రోజుల పాటు, అత్యంత నిష్టాగరిష్టంగా మాలధారణ చేస్తారు తెలుగు భక్తులు. వేకువ జామున చన్నీటి స్నానాలతో, ఏక భుక్తాలతో.. తెలుగు వారు పాటించే కఠిన నియమాలు బహుశా దక్షిణాదిలో మరెవరూ పాటించరేమో. అలా మనమిక్కడ అయ్యప్ప స్వామివారికి ఇన్నేసి నియమ నిష్టలతో కొలుస్తుంటే.. అక్కడ స్వామివారంటే వారికి కనీస భయభక్తులు లేవా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. ఈ ఏడాది మొత్తం శబరిగిరీశుడి హుండీ ఆదాయం 330 కోట్లకు పైగా వచ్చింది. ఇందులో తెలుగువారి వాటా సగానికి పైగా ఉంటుందని అంచనా. ఆ విరాళాలు సరైన మార్గంలోనే వెళ్తున్నాయా? అన్న అనుమానానికి ఆస్కారమేర్పడుతోంది.

అందుకు కారణం శబరిమల ప్రధాన పూజారి కందారరు రాజీవరును అరెస్టు ఉదంతమే. శుక్రవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో.. ఈ అరెస్టు జరిగింది. అది కూడా పూర్తి విచారణ తర్వాతే ఈ అరెస్టు చేసినట్టు చెబుతున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ తో రాజీవరుకు సన్నిహిత సంబంధాలున్నట్టు గుర్తించారు సిట్ అధికారులు. బంగారు తాపడం చోరీ వ్యవహారంలో రాజీవరు పాత్ర కూడా ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలుస్తోంది.

Advertisement

ఉన్ని కృష్ణన్ ని శబరిమలకు తీసుకువచ్చింది కూడా తంత్రి రాజీవరుగానే గుర్తించారు. ఇదంతా కూడా ఇతర నిందితుల వాంగ్మూలం ద్వారా తేల్చారు. బంగారు తాపడాల చోరీ గురించి ఆయనకు ముందే తెలుసని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఈడీ సైతం కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

ఇంతకీ ఏంటీ కేసు? అని చూస్తే.. శబరిమల గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారుపూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వీటిని సరి చేయించి సరికొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్ని కృష్ణన్ అనే దాత తీస్కెళ్లారు. ఈ పని చెన్నైలోని ఒక సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే టైంలో తాపడాల బరువు 42.100 కిలోలుగా రికార్డుల్లో రాసి ఉన్నారు.

Also Read: కాకాణి గోవర్ధన్ ఇంటి వద్ద హై టెన్షన్.. తెలంగాణపై విమర్శలు

అయితే ఎలక్ట్రో ప్లేటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైనట్టు సదరు కంపెనీ చెప్పింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4. 524 కేజీల మేర తగ్గింది. దీంతో ఈ విషయంలో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు అధికారులు. దీంతో ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించింది. ఈ బృందమే ప్రస్తుతం ఈ తాపడాల కేసులో విచారణ సాగిస్తోంది. అందులో భాగంగానే శబరి తంత్రి రాజీవరు అరెస్టు జరిగినట్టు తెలుస్తోంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×