E-Paper
Advertisement

Ayodhya: అయోధ్య రాముడికి 155 దేశాల నదీజలాలతో అభిషేకం.. ఎప్పుడంటే..?

Ayodhya: అయోధ్య రాముడికి 155 దేశాల నదీజలాలతో అభిషేకం.. ఎప్పుడంటే..?
Advertisement

Ayodhya: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో మహాక్రతువు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. శ్రీరాముడి విగ్రహానికి 155 దేశాల్లోని నదుల నుంచి సేకరించిన జలాలతో అభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ నెల 23న శ్రీరాముడికి జలాభిషేకం నిర్వహించనున్నారు. మణిరామ్‌ దాస్‌ చావ్నీ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పాల్గొంటారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఢిల్లీకి చెందిన రామభక్తుడు విజయ్‌ జొలీ నేతృత్వంలోని బృందం 155 దేశాల నుంచి తీసుకువచ్చిన జలాలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అందజేస్తారు. పాకిస్థాన్‌లోని రావి నది నుంచి కూడా జలాలు సేకరించారు. ఈ జలాలను పాక్‌లోని హిందువులు దుబాయ్‌కు పంపారు. అక్కడ నుంచి ఢిల్లీకి జలాలు చేరుకున్నాయని చంపత్ రాయ్‌ వివరించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×