E-Paper
Advertisement

Rajnath Singh : తవాంగ్‌లో ఘర్షణ.. రాజ్‌నాథ్‌ ఉన్నతస్థాయి సమావేశం

Rajnath Singh : తవాంగ్‌లో ఘర్షణ.. రాజ్‌నాథ్‌ ఉన్నతస్థాయి సమావేశం
Advertisement

Rajnath Singh : భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై కేంద్రం దృష్టి పెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య తాజాగా ఘర్షణ చెలరేగాయి. ఈ నేపథ్యంలో.. చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతా పరిస్థితులపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్… లెఫ్టినెంట్‌ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమావేశం కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై రాజ్ నాథ్ సింగ్ చర్చిస్తారని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు ఈ వివాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మాట్లాడతారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

విదేశాంగ మంత్రి జై శంకర్‌, ఆర్మీ జనరల్‌ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, నౌకాదళాధిపతి అడ్మిరల్‌ హరికుమార్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి .. రాజ్‌నాథ్‌తో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. మరోవైపు తవాంగ్‌లో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై భద్రతా బలగాలు ఇప్పటికే కేంద్ర రక్షణమంత్రికి తాజా వివరాలు ఇచ్చినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement

తవాంగ్‌ సెక్టార్‌లోని యాంగ్‌త్సె ప్రాంతం వద్ద ఈ నెల 9న భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో రెండుదేశాల సైనికులు గాయపడినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఈ క్రమంలోనే రక్షణ, విదేశాంగశాఖలు ఉన్నతస్థాయి సమావేశానికి సిద్ధమయ్యాయి. భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై దృష్టిపెట్టాయి. గతంలో గల్వాన్ లోయలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం చైనాను కవ్వింపు చర్యలను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×