E-Paper
Advertisement

Parliament : పార్లమెంటులో ఉగ్రదాడికి 21 ఏళ్లు..

Parliament : పార్లమెంటులో ఉగ్రదాడికి 21 ఏళ్లు..
Advertisement

Parliament : భారత పార్లమెంట్​పై జరిగిన ఉగ్రదాడికి 21 ఏళ్లు అయిన నేపథ్యంలో అప్పటి ఘటనలో మరణించిన భద్రతా సిబ్బందిని స్మరించుకున్నారు పలువురు ప్రముఖులు. పార్లమెంట్ ఆవరణలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జునఖర్గే, సోనియాగాంధీ నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. వారు చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని అన్నారు. ఆ ఘటనలో మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

లష్కరే తొయిబా ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు సాయుధులు 2001 డిసెంబర్ 13న పార్లమెంట్​పై దాడి చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్​లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. ఇందులో ఓ పౌరుడు, భద్రతా సిబ్బంది సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పార్లమెంట్​లో 100 మంది సభ్యులు ఉన్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×