E-Paper
Advertisement

మహిళా బిల్లుపై చ‌ర్చ‌.. ప్రధాని మోదీ జాదూగర్ అంటూ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మహిళా బిల్లుపై చ‌ర్చ‌.. ప్రధాని మోదీ జాదూగర్ అంటూ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Rahul Gandhi: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై వాడివేడిగా చ‌ర్చ‌ జరిగింది. ఈ సంద‌ర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తూ, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక దేశ రాజకీయ మ్యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చేసిన జాదూగర్ (మెజీషియన్) వ్యాఖ్యలు సభలో పెను దుమారాన్ని రేపాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా డీలిమిటేషన్‌తో లింక్ చేయడం ద్వారా బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం దేశ భౌగోళిక సరిహద్దులను మార్చాలని చూస్తోందని రాహుల్ ఆరోపించారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్లలో ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రత్యర్థి పార్టీల బలాన్ని తగ్గించారని విమర్శించారు. ఇదే పద్ధతిని జాతీయ స్థాయిలో అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు మరియు చిన్న రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “కేవలం అధికారం కోసం రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని దెబ్బతీయడం దేశ వ్యతిరేక చర్య.” అని ఆయన అభివర్ణించారు.

Advertisement

ఈ మొత్తం ప్రక్రియ వెనుక కులగణనను తప్పించుకునే ఉద్దేశం ఉందని రాహుల్ గాంధీ వాదించారు. ఓబీసీ, దళిత వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా అడ్డుకోవడమే బీజేపీ లక్ష్యమని, ఇది రాజ్యాంగం కంటే మనువాదానికే ప్రాధాన్యత ఇవ్వడమేనని విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కులగణన గురించి మాట్లాడుతున్నా, అది అసలు ప్రాతినిధ్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో స్పష్టత ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు. రాబోయే 15 ఏళ్ల వరకు వెనుకబడిన వర్గాలకు అధికారం దక్కకుండా చేసేందుకే ఈ ప్లాన్ అని ఆరోపించారు.

చర్చ మధ్యలో రాహుల్ గాంధీ కొంత చమత్కారాన్ని కూడా జోడించారు. తనకు, ప్రధాని మోదీకి “భార్య సమస్య” లేదని, అందుకే తాము తల్లులు, సోదరీమణుల సలహాలు ఎక్కువగా తీసుకుంటామని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రతి ఇంట్లో మహిళలు ఒక చోదక శక్తి అని, వారి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు.

Advertisement

మహిళా రిజర్వేషన్లపై మాట్లాడుతూ ప్రధాని మోదీని బాలాకోట్ మెజీషియన్ అని రాహుల్ సంబోధించడంతో సభలో గందరగోళం నెలకొంది. అధికార పక్ష సభ్యులు ఒక్కసారిగా లేచి రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి అయిన ప్రధానిని అవమానించడం సరికాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని, రాహుల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

Read Also: మీ ఇంట్లోని ఆడబిడ్డలను గుర్తు తెచ్చుకోండి.. చరిత్ర సృష్టించేందుకు కలిసి రండి.. ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×