E-Paper
Advertisement

Punjab News: రాత్రికి రాత్రే మారిన పేదోడి జీవితం.. కలిసొచ్చిన ఆరు రూపాయలు, ఆపై కోటి జాక్‌పాట్

Punjab News: రాత్రికి రాత్రే మారిన పేదోడి జీవితం.. కలిసొచ్చిన ఆరు రూపాయలు, ఆపై కోటి జాక్‌పాట్
Advertisement

Punjab News:  అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో ఏ విధంగా వరిస్తుందో చెప్పలేము.  రోజువారీ కూలీకి అదే జరిగింది. కేవలం ఆరు రూపాయలతో కోటి జాక్ పాట్ కొట్టేశాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నా రా? కేవలం ఆరు రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అతడికి అదృష్టం వరించడంతో ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.

పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన కూలీ పేరు జాస్మాయిల్ సింగ్. అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఇంట్లో భారం పెరిగింది. ఇటుక బట్టీలో సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. ఆదాయం అంతంత మాత్రమే. రోజు రోజుకూ అప్పులు పెరిగాయి. చివరకు 25 లక్షల వరకు అప్పు చేశాడు.

Advertisement

ఈ పరిస్థితి గురించి గట్టెక్కలేక జీవితాన్ని ముగించాలని ఓ ఆలోచనకు వచ్చేశాడు. ఫిరోజ్‌పూర్ జిల్లాలో జిరాను సందర్శించేటప్పుడు వెళ్లాడు జాస్మాయిల్. పని ముగించుకున్న తర్వాత పాత చక్కెర మిల్లు సమీపంలోని కాళీ మాత ఆలయానికి వెళ్లాడు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని తిరిగి పయనమయ్యాడు. వెళ్తూ దారిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

జేబులో ఛార్జీలు పోను మిగిలిన పది రూపాయల్లో ఆరు రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. టికెట్ కొనుగోలు చేసిన కొద్ది గంటల్లో కోటి రూపాయల లాటరీ పలికింది. షాపు ఓనర్ చేసి మీ నంబర్ చెక్ చేసుకోండి.. కోటి రూపాయలు గెలుచుకున్నారని చెప్పాడు. కాసేపు నమ్మలేకపోయాడు.. కలా.. నిజమా తనను తాను పరీక్షించుకున్నాడు. చివరకు ఆనందంలో తేలిపోయాడు.

Advertisement

ALSO READ: నిమిష ప్రియ వ్యవహారం.. డబ్బుతో ప్రాణానికి వెల కట్టలేమన్న బాధిత ఫ్యామిలీ

కొనుగోలు చేసిన‌ టికెట్‌ 50E42140 నెంబర్ కు కోటి రూపాయల జాక్‌పాట్ త‌గిలింది. పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు జాస్మాయిల్. ఏ మాత్రం ఆలస్య చేయకుండా జాస్మాయిల్ సింగ్ కుటుంబసభ్యులు ఇరుగుపొరుగు వారి నుంచి కొద్ది డబ్బులు తీసుకుని తన గ్రామంలో స్వీట్లు పంచిపెట్టాడు. డ్రమ్స్ వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు.

పలికిన లాటరీలో 25 లక్షలు అప్పు చెల్లించడానికి ఉపయోగిస్తానని తెలిపాడు. మిగిలిన డ‌బ్బు పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానని మనసులోని మాట బయటపెట్టాడు. పిల్లల విద్య కోసం ఉపయోగిస్తానని తెలిపాడు. జాస్మాయిల్ భార్య వీర్పాల్ కౌర్ అంతే ఆనందాన్ని వ్యక్తం చేసింది. జీవితంలో తాము ఎప్పుడు ఊహించలేమన్నారు.

పిల్లలకు మంచి జీవితానికి అందిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఫిరోజ్‌పూర్ జిల్లాలో లాటరీ ద్వారా లక్షాధికారి కావడం ఇది నాలుగోసారి అని షాపు యజమాని తెలిపాడు. మొత్తానికి జాస్మాయిల్ సింగ్ ఇంట్లోకి ఆషాడమాసం వేళ లక్ష్మీ ఆ విధంగా వచ్చిపడింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×