E-Paper
Advertisement

The first tunnel railway: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

The first tunnel railway: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం.. ప్రారంభించిన ప్రధాని మోదీ..
Advertisement

First tunnel railway in Kashmir: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం (T-50) అందుబాటులోకి వచ్చింది. దీని పొడవు 12.77 కిలో మీటర్లు ఉంటుంది. జమ్మూ-కాశ్మీర్ లో ఉదంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన బనిహాల్-ఖడీ-సుంబడ్- సంగల్ దాన్ సెక్షన్ (14.1కి.మీ) ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ మార్గంలోనే ఖడీ-సుంబడ్ ల మధ్య ‘ టీ-50’ సొరంగ మార్గం వస్తుంది. బారముల్లా రెండు విద్యుత్ రైళ్లకు జమ్మూ నుంచి వర్చువల్ గా పచ్చజెండా ఊపారు. అయితే కశ్మీర్ లోయలో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్డం ఇదే తొలిసారి.

‘టీ-50’ సొరంగం పొడవు 12.77 కి.మీ. బనిహాల్- సంగల్‌దాన్‌ సెక్షన్‌లోని 11 సొరంగాల్లో ఇదే అత్యంత సవాల్‌గా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. యూపీఏ హయాంలో 2010లోనే పనులు ప్రారంభించారు. దాదాపు 14 ఏళ్లకు అందుబాటులోకి వచ్చింది ఈ సొరంగ మార్గం. సొరంగం లోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు అధికారులు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు ‘టీ-50’కి సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ నిర్మించారు. ప్రతీ 375 మీటర్ల దూరంలో ఈ రెండింటినీ కలుపుతూ మార్గాలను ఏర్పాటు చేశారు.

Advertisement

Read More: హర్యానా ప్రభుత్వంపై అవిశ్వాసం.. ఫిబ్రవరి 22న చర్చ..

యూఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్టును రూ.41 వేల కోట్లతో చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం పొడవు 272 కి.మీ. బారాముల్లా- సంగల్‌దాన్‌, ఉధంపుర్‌- కాట్రా సెక్షన్‌ల మధ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాట్రా- సంగల్‌దాన్‌ల మధ్య 63 కిలోమీటర్ల వరకు పనులు సాగుతున్నాయి.

Advertisement

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ‘చీనాబ్‌ వంతెన’, దేశంలో తొలి తీగల రైలు వంతెన ‘అంజీఖాడ్‌’లు ఈ మార్గంలోనే ఉన్నాయి. తాజాగా బనిహాల్- సంగల్‌దాన్‌ సెక్షన్‌ ప్రారంభంతో కశ్మీర్ లోయ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలనే లక్ష్యానికి మరింత చేరువైనట్లు అధికారులు పేర్కొన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×