E-Paper
Advertisement

Manipur Poll Violence: మణిపూర్ కాల్పుల ఘటన.. ముగ్గురు అరెస్ట్

Manipur Poll Violence: మణిపూర్ కాల్పుల ఘటన.. ముగ్గురు అరెస్ట్
Advertisement

Violence breaks out: లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న మొదటి విడతగా 21 రాష్ట్రాలు, యూటీల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా, మణిపూర్ లో పలు చోట్లా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇంకొన్ని చోట్ల కాల్పులు, మరికొన్ని చోట్లా ఈవీఎంలను కాలబెట్టడం, పగులగొట్టడం వంటివి చేశారు.

బిష్ణుపులోని మొయిరాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని థమ్నాపోక్పి పోలింగ్ కేంద్రం దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇంపాల్ ఈస్ట్ జిల్లా మోయిరంగ్ కాంపూ సాజెబ్ లోని పోలింగ్ బూత్ వద్ద పలువురు దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వృద్ధుడు గాయపడ్డాడు. ఖోంగ్ మాన్ జోన్ 4 పోలింగ్ స్టేషన్ లో ఓటర్లు, సాయుధ దుండగులకు మధ్య జరిగిన ఘర్షణలో ఈవీఎంలు కాలిపోయాయి. ఇంకొన్ని ధ్వంసమయ్యాయి.

Advertisement

Also Read…అగ్ని ప్రమాదాల్లో.. భారీ ఆస్తి నష్టం ?

అయితే, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని పోలింగ్ స్టేషన్ సమీపంలో కాల్పుల ఘటనలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. వారు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని మోయిరంగ్ కాంపూ సాజెబ్ వద్ద కాల్పుల ఘటనలో పాల్గొన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక పిస్టల్, మందుగుండు సామాగ్రి, రూ. 15 లక్షల నగదును స్వాధీనం చెసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×