E-Paper
Advertisement

PM Kisan 17th Installment: పీఎం కిసాన్ 17వ విడత.. నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్..

PM Kisan 17th Installment: పీఎం కిసాన్ 17వ విడత.. నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్..
Advertisement

PM Kisan 17th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 17వ విడత నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూన్ 18న ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ. 20 వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్వవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.

పీఎం కిసాన్ పథకం 17వ విడత విడుదలైన తర్వాత కృషి శాఖలుగా గుర్తింపు పొందిన 30 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలకు ప్రధాని మోదీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తారని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

కేంద్ర వ్వవసాయ, రైతు సంక్షేమ శాఖ, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వ్యవసాయ మంత్రి చౌహాన్ పేర్కొన్నారు.

Advertisement

అదనంగా, రైతులకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని ఆయన స్పష్టం చేశారు. తనకు ప్రధాని మోదీ వంద రోజుల ప్రణాలికతో కూడిన బాధ్యతలను ఇచ్చారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

జూన్ 10న మూడోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధి పథకం 17వ విడత నిధులు విడుదలపై తొలి సంతకాన్ని చేశారు. దీంతో ఈ పథకం ద్వారా మొత్తం 903 కోట్ల రైతులకు లబ్ది చేకూరుతుంది.

Also Read: స్పీకర్ రేస్ నుంచి జేడీయూ అవుట్..! టీడీపీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ..

2019 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రైతుల బ్యాంకు అకౌంట్లకు నేరుగా సంవత్సరానికి 6 వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది. మొత్తం మూడు సమాన వాయిదాల్లో అంటే ప్రతి వాయిదాకు రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×