E-Paper
Advertisement

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
Advertisement

PM Modi: ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను మూడో స్థానంలో నిలబెట్టడమే తమ ధ్యేయమన్నారు ప్రధాని నరేంద్రమోదీ. దీనికి అనుగుణంగా కోట్లాది మంది భారతీయులు పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేది మా కార్యచరణగా చెప్పుకొచ్చారు.

కేంద్రంలో మూడోసారి మా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో తీసుకున్న ప్రణాళికకు సంబంధించి ట్రైలర్ కనిపిస్తుందన్నారు. సోమవారం గుజరాత్‌లో జరుగుతున్న కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆధర్యంలో జరుగుతున్న నాలుగో గ్లోబర్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ల సదస్సు హాజరయ్యారు. మూడురోజులపాటు జరుగుతున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.

Advertisement

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. 21వ శాతాబ్దానికి భారత్ అత్యుత్తమ దేశంగా ఉంటుందని భారతీయులేకాదు, ప్రపంచం మొత్తం భావిస్తోందన్నారు. డైవర్సిటీ, స్థాయి, సామర్థ్యం, పనితీరు ప్రత్యేకమైనవి గా చెప్పుకొచ్చారు. రాబోయే వెయ్యేళ్లకు పునాది వేస్తోందన్నారు. ఉన్నత స్థాయికి చేరడం కాదని, అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయమన్నారు.

అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు తన శక్తి సామర్థ్యాలు భారత్‌కు తెలుసన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు ప్రధాని నరేంద్రమోదీ. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీ, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, యూపీ రాష్ట్రాలు ఈ సదస్సు భాగస్వామిగా వ్యవహరిస్తున్నాయి.

Advertisement

ALSO READ: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇంధన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీతో కలిసి మాట్లాడారాయన. ఏపీలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు. ఈ రంగంలో పెట్టుబడులకు సానుకూల వాతావారణ ఉండాలన్నారు. ఇలాంటి సదస్సు ఎంతగానో ఉపయోగపడ తాయన్నారు సీఎం చంద్రబాబు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×