E-Paper
Advertisement

Mamatha Banerjee: విపక్షాలపై స్వల్ప ఆధిక్యంలో ఎన్డీఏ.. మోదీ రాజీనామాకు మమతా డిమాండ్

Mamatha Banerjee: విపక్షాలపై స్వల్ప ఆధిక్యంలో ఎన్డీఏ.. మోదీ రాజీనామాకు మమతా డిమాండ్
Advertisement

Lok sabha Election Results 2024(Latest political news in India): ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విపక్షాలపై స్వల్ప ఆధిక్యంలో ఎన్డీఏ కొనసాగుతుండటంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్ దాటకపోవడంతో తాను సంతోషంగా ఉన్నానని మమతా తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని మోదీ కోల్పోయారని విమర్శించారు. ఎన్నికల్లో 400కుపైగా సీట్లు గెలుస్తామని అనేక సందర్భాల్లో మోదీ చెప్పారని గుర్తు చేశారు. ఇండియా కూటమిపై ఎన్డీఏ కూటమి స్వల్ప ఆధిక్యతను కనబరిచింది..అందుకే మోదీ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏకు విపక్ష కూటమి గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బెంగాల్‌లో బీజేపీపై టీఎంసీ ఆధిక్యం కనబరిచింది. 42 లోక్‌సభ స్థానాలకు గానూ టీఎంసీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కేవలం 10 స్థానాల్లో ముందంజలో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి.

Also Read: బీజేపీ అహంకారంతో రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసింది: రాహుల్ గాంధీ

Advertisement

గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 18 స్థానాల్లో గెలుపొందగా.. ఈ సారి 10 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేలా ఉంది. అయితే ఫలితాలు వెలువడుతున్న సమయంలో రాష్ట్రంలో తాము ఆశించిన రీతిలోనే ఫలితాలు వచ్చాయని మమతా పేర్కొన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తాజా ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×