E-Paper
Advertisement

PM Modi: ‘భారత్ మండపం’.. మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ.. మూడో ఆర్థికశక్తిగా భారత్‌..

PM Modi: ‘భారత్ మండపం’.. మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ.. మూడో ఆర్థికశక్తిగా భారత్‌..
Advertisement
Bharat Mandapam Inauguration

Bharat Mandapam Inauguration(PM Modi news today in telugu): మూడోసారి కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తుంది.. ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుంది.. అంటూ ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఊహించని రీతిలో మన దేశం ఎన్నో విజయాలు సాధిస్తోందని.. ఈ అభివృద్ధి ప్రయాణం ఆగదని అన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (IECC)ను డ్రోన్‌తో హైటెక్‌గా ప్రారంభించారు పీఎం మోదీ. జీ-20 సమ్మిట్‌కు వేదిక కానున్న ఈ కన్వెన్షన్‌ సెంటర్‌కు ‘భారత్‌ మండపం’ (Bharat Mandapam) అని నామకరణం చేశారు.

ఢిల్లీలో 123 ఎకరాల విస్తీర్ణంలో.. దాదాపు 2,700 కోట్ల ఖర్చుతో.. హైటెక్ హంగులతో IECCను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్‌లో జరిగే జీ20 సదస్సుకు ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వనుంది. దేశ విదేశాలకు చెందిన 3వేల మందికి పైగా అతిథిలు హాజరుకానున్నారు. కొత్తగా నిర్మించిన ‘భారత్‌ మండపం’ మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెబుతుందన్నారు మోదీ.

Advertisement

ఇప్పటికే పార్లమెంట్ కొత్త భవనం గురించి భారతీయులంతా గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు ప్రధాని. పని చేసే విధానంతో పాటు పని వాతావరణాన్ని కూడా మార్చుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

PM-Modi-IECC

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×