E-Paper
Advertisement

Parliament Winter Season 2024: రెండోరోజు పార్లమెంట్‌ సమావేశాలు.. అదానీపై చ‌ర్చ జ‌ర‌గాల్సిందే.. ప‌ట్టువీడ‌ని విప‌క్షాలు

Parliament Winter Season 2024: రెండోరోజు పార్లమెంట్‌ సమావేశాలు.. అదానీపై చ‌ర్చ జ‌ర‌గాల్సిందే.. ప‌ట్టువీడ‌ని విప‌క్షాలు
Advertisement

Parliament Winter Season 2024: పార్ల‌మెంట్ శీతాకాల‌ స‌మావేశాలు నిన్న ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కాగా ఈరోజు రెండో రోజు పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో రాజ్య‌స‌భ ముందు భార‌తీయ వాయుయాన్ విధేయ‌క్ బిల్లును ప్ర‌వేశపెట్ట‌నున్నారు. ఈ బిల్లును కేంద్ర విమాన‌యాన మంత్రి రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. అంతే కాకుండా అదానీ కేసు, మ‌ణిపూర్ అల్ల‌ర్ల అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించాల‌ని విప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. నిన్న అదానీ లంచం ఆరోప‌ణ‌లపై చ‌ర్చ జ‌ర‌పాల్సిందేన‌ని ఇండియా కూట‌మి నేత‌లు డిమాండ్ చేశారు.

Also read: తాజ్ హోటల్‌లో.. ఎంపీలకు దావత్ ఇస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం

Advertisement

రాజ్య స‌భ‌, లోక్ స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని అన్నారు. కానీ లోక్ స‌భ స్పీక‌ర్, రాజ్య‌స‌భ చైర్మ‌న్ చ‌ర్చ‌కు అనుమ‌తించ‌లేదు. దీంతో విప‌క్ష ఎంపీలు సైతం త‌గ్గేదే లే అన్నారు. అదానీని మోడీ కాపాడుతున్నాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. స‌భ‌ను నేటికి వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఇవాళ కూడా అదానీ లంచం ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గాల్సిందేన‌ని ఇండియా కూట‌మి నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌ లీడర్ల సమావేశం అయ్యారు. పార్లమెంట్‌ భవన్‌లో కూటమి భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌ లీడర్లు భేటీ అయ్యారు.

అదానీపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ని ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయాల్సిందేన‌ని ప‌ట్టుప‌డుతున్నారు. ఇదిలా ఉంటే అదానీ లంచం వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డంతో ప్ర‌ధాని మోడీపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మోడీ ప్రాజెక్టుల‌న్నీ అదానీకి క‌ట్ట‌బెట్టి ఆయ‌న‌ను కుభేరుడిని చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అర్హ‌త లేకున్నా అదానీ కంపెనీల‌కు రుణాలు ఇస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో అమెరికాలో లంచం కేసులో అదానీ అరెస్ట్ అయితే మోడీ రాజీనామా చేయాల‌ని ఇండియా కూట‌మి నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×