E-Paper
Advertisement

Operation Sindoor : ఇండియాను తెగ పొగిడేస్తున్న పాకిస్తానీ.. వీడియో వైరల్

Operation Sindoor : ఇండియాను తెగ పొగిడేస్తున్న పాకిస్తానీ.. వీడియో వైరల్
Advertisement

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్. గ్రాండ్ సక్సెస్. టార్గెట్ చేసిన 9 స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. జస్ట్ 25 నిమిషాల్లోనే టాస్క్ ఫినిష్ చేసేసింది. టార్గెట్ కొంచెం కూడా అటూ ఇటు కాలేదు. ప్రయోగించిన మిస్సైల్స్ ఒక్క ఇంచు కూడా డైవర్ట్ కాలేదు. సామాన్య పౌరులు, పాక్ సైనికులకు చిన్న గీత పడలేదు. ఈ మాట చెబుతున్నది మనం కాదు.. ఓ పాక్ పౌరుడు. అందుకే ఇప్పుడు ఆ పాకిస్తానీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాక్ పరువంతా తీస్తోంది. ఇండియా ఇమేజ్ పెంచేస్తోంది.

భారత సైన్యం కచ్చితత్వంతో టార్గెట్‌ను పినిష్ చేసిందని అంటున్నాడు ఆ పాక్ పౌరుడు. ఇజ్రాయిల్, ఇరాన్‌లా దాడులు చేసింటే ఈపాటికి పాక్ శిథిలావస్థకు చేరి ఉండేదని చెబుతున్నాడు. భారత్‌ ఆర్మీ బేస్ క్యాంపులను ధ్వంసం చేశామని పాక్ చెబుతున్నా.. అందులో నిజంలేదంటూ సొంత దేశం ఇజ్జత్ తీసిపడేశాడు.

Advertisement

పాక్ రక్షణ వ్యవస్థపైనా ఆ దేశ పౌరుడి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మిసైల్స్ దాడి చేస్తే.. పాక్ కనీసం అడ్డుకోలేకపోయిందన్నాడు. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడి చేసిందని.. ఒకవేళ పాక్‌లోని ఇతర ప్రాంతాల్లో భారత్ దాడి చేసినా చేసేదేమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఇండియాకు సపోర్ట్ చేయడం లేదంటూనే.. పాక్ పరువంతా తీసేశాడు.

Advertisement

పాక్ ఫేక్ ప్రచారం

ఇండియాను ఏం చేయలేక.. సోషల్ మీడియానే నమ్ముకుంది పాకిస్తాన్. పరువు నిలబెట్టుకునేందుకు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోంది. గుజ్రాన్‌వాలాలో భారత్ మిస్సైల్‌ను పాక్ కూల్చేసిందని ఓ వీడియో.. పాక్ అనుకూల మీడియాలో వైరల్ అవుతోంది. అది తప్పుడు వార్త అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. పాత వీడయోలు వైరల్ చేసి పాక్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన మిస్సైల్ శిథిలాలను చూపించి భారత్ క్షిపణిగా పాక్ ప్రచారం చేస్తోందని ఆరోపించింది పీఐబీ.

ఫేక్ వీడియోలే దిక్కా?

అమృత్‌సర్‌లోని భారత సైనిక స్థావరంపై దాడులు చేశామని పాక్ మరో వీడియోని కూడా వైరల్ చేస్తోంది. ఇందులో కూడా నిజంలేదని స్పష్టం చేసింది పీఐబీ. 2024 నాటి కార్చిర్చు వీడియోని ప్రసారం చేసి అమృత్‌సర్‌ సైనిక స్థావరాన్ని ధ్వంసం చేశామని చెప్పుకుంటోందని ప్రకటించింది. తప్పుడు వార్తలకు ప్రభావితం కావొద్దని.. అవాస్తవాలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హెచ్చరించింది.

Also Read : పాకిస్తాన్‌కు కేఏ పాల్.. మోదీతో బిగ్ టాస్క్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×