E-Paper
Advertisement

SC pulls up center over delay: కేంద్ర ప్రభుత్వానికి భారీ హెచ్చరిక.. నవంబర్ 14 లోగా..

SC pulls up center over delay: కేంద్ర ప్రభుత్వానికి భారీ హెచ్చరిక.. నవంబర్ 14 లోగా..
Advertisement

SC Pulls up Centre: పెన్షన్ చెల్లింపు విషయంలో ఆలస్యం చేసిన కేంద్రం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. భారీగా జరిమానా విధించింది. భారత సైన్యంలో రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్ కు సంబంధించి కేంద్రం ఓ నిర్ణయం తీసుకోకపోవడంపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకం ప్రకారం పెన్షన్ చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నది. ఈ ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందంటూ న్యాయస్థానం మండిపడింది. ఈ క్రమంలో కేంద్రానికి రూ. 2 లక్షల జరిమానాను విధిస్తూ తీర్పు వెల్లడించింది.

Also Read: పార్టీ వద్దని వారించినా.. మళ్లీ అదే వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం

Advertisement

అంతేకాదు.. ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమంటూ పేర్కొన్నది. నవంబర్ 14 లోగా సమస్యను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. లేదంటే పెన్షన్ పెంపు విషయమై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందంటూ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×