E-Paper
Advertisement

Rahul Gandhi: రాహుల్‌పై బ్యాక్ టు బ్యాక్ పరువునష్టం కేసులు.. ఏదో జరుగుతోంది?

Rahul Gandhi: రాహుల్‌పై బ్యాక్ టు బ్యాక్ పరువునష్టం కేసులు.. ఏదో జరుగుతోంది?
Advertisement
Rahul-Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్‌ సీనియర్ నేత రాహుల్ గాంధీని పరువునష్టం కేసులు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మోదీ అనే ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. లేటెస్ట్‌గా రాహుల్ పై హరిద్వార్‌ కోర్టులో పరువునష్టం పిటిషన్‌ దాఖలైంది. ఈ సారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ పై చేసిన విమర్శలకు గాను పరువునష్టం కేసు నమోదైంది.

ఈ ఏడాది జనవరి 9న అంబాలలో జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ RSS కార్యకర్తలను 21వ శతాబ్దపు కౌరవులు అన్నారు. ఈ యాత్ర ముగిసిన మూడు నెలల తర్వాత ఇప్పుడు కమల్ బదూరియా అనే RSS కార్యకర్త హరిద్వార్ కోర్టులో పరువునష్టం పిటిషన్ వేశాడు. ఈ నెల 12న ఈ పిటిషన్ విచారణకు రానుంది.

Advertisement

మరోవైపు అదే రోజున మరో పరువునష్టం కేసులో విచారణకు హాజరుకావాలని పాట్నా కోర్టు రాహుల్ గాంధీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వేశారు. మోదీ అనే ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీకి ఇటీవల రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

మహారాష్ట్రలోని థానేలో కూడా రాహుల్ గాంధీపై ఒక పరువు నష్టం కేసు నడుస్తోంది. మహాత్మా గాంధీ హత్యకు RSS కారణమని 2014లో రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై RSS కార్యకర్త ఒకరు థానే కోర్టులో పిటిషన్‌ వేశారు.

Advertisement

ఇలా రాహుల్ గాంధీ పరువునష్టం కేసుల ఉచ్చులో చిక్కుకుంటూ.. రాజకీయంగా ఇరుకున పడుతున్నారు. సునాయాసంగా ప్రత్యర్థులకు టార్గెట్‌గా మారుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×