E-Paper
Advertisement

Odisha Train Tragedy : ఘోర కలి .. ఆ 20 నిమిషాల్లోనే.. ప్రమాదం జరిగింది ఇలా..?

Odisha Train Tragedy : ఘోర కలి .. ఆ 20 నిమిషాల్లోనే..   ప్రమాదం జరిగింది ఇలా..?
Advertisement

Odisha Train Tragedy(Telugu breaking news today) : ఒడిశాలోని బాలేశ్వర్‌ లో 3రైళ్లు ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. నిమిషాల వ్యవధిలోనే పెను విషాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. చాలా మంది ప్రయాణికులు నిద్రలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. మరికొంది తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేశారు.

అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 6.50 గంటల నుంచి 7.10 మధ్యలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళుతుండగా బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద తొలుత పట్టాలు తప్పింది. ఈ రైలులోని కొన్ని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి.

Advertisement

ఆ బోగీలను షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఆ తర్వాత బోల్తాపడ్డ కోరమండల్‌ బోగీలను గూడ్సు రైలు దూసుకొచ్చి ఢీకొట్టింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని స్థానికులు , అధికారులు చెప్పారు. అలాగే ప్రమాదం సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైళ్లు అతి వేగంతో ఉన్నాయని అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు . క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు చాలామంది ముందుకొచ్చారు. బాలాసోర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రక్తం ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరారని తెలుస్తోంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×