E-Paper
Advertisement

Odisha Athletes: రైలులో టాయిలెట్ల దగ్గర కూర్చొని ప్రయాణించిన అథ్లెట్లు.. ఇదేనా వారికి ఇచ్చే గౌరవం?

Odisha Athletes: రైలులో టాయిలెట్ల దగ్గర కూర్చొని ప్రయాణించిన అథ్లెట్లు.. ఇదేనా వారికి ఇచ్చే గౌరవం?
Advertisement

Odisha Athletes: ఒడిశాకు చెందిన యువ అథ్లెట్లు రైలులో టాయిలెట్ వద్ద కూర్చొని ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది. 69వ జాతీయ స్కూల్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు 18 మంది ఒడిశాకు చెందిన స్కూల్ లెవల్ అథ్లెట్లు.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే వారికి కన్ఫార్మ్ టికెట్లు లేకపోవటంతో జనరల్ కంపార్ట్మెంట్, రైలు మరుగుదొడ్డి వద్ద నేలపై కూర్చొని ప్రయాణించాల్సి వచ్చింది. ఈ టీమ్ లో మొత్తం 10 మంది బాలురు, ఎనిమిది మంది బాలికలు ఉన్నారు.

టాయిలెట్ల వద్ద ప్రయాణం

తీవ్రమైన చలిలో యువ అథ్లెట్లు రైలు టాయిలెట్ల దగ్గర కూర్చోవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ఈవెంట్‌లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లలను ఇలాగేనా చూసుకునేది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే టోర్నమెంట్ పూర్తైన తర్వాత కూడా వారికి ఇబ్బందులు తప్పలేదు. ఒడిశాకు తిరుగు ప్రయాణంలో అథ్లెట్లకు ఇబ్బందులు తప్పలేదు. అథ్లె్ట్ల ప్రయాణానికి టికెట్లు ఏర్పాటు చేయకపోవడంతో.. ప్లేయర్లు జనరల్ కోచ్‌లలోకి వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది. క్రీడాకారులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటు విమర్శిస్తున్నారు.

Advertisement

అలాగే తల్లిదండ్రులు లేదా సంరక్షకులను జట్టుతో ప్రయాణించడానికి అనుమతించలేదని సమాచారం. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. యువ అథ్లెట్లు సుదీర్ఘ ప్రయాణాలలో పెద్దల పర్యవేక్షణ లేకుండా ఉండకూడదని నెటిజన్లు అంటున్నారు.

ఒడిశాలో చర్చనీయాంశం

Advertisement

ఈ ఘటనపై ఒడిశాలో తీవ్ర చర్చనీయాంశం అయింది. తల్లిదండ్రులు, క్రీడా ప్రేమికులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. విమర్శలు వస్తున్నప్పటికీ ఒడిశా ప్రభుత్వం ఈ ఘటనపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు నవజ్యోతి పట్నాయక్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అథ్లెట్లకు కనీస సౌకర్యాలను అందించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. క్రీడలను ప్రోత్సహించడం గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తుందని తప్ప ఆచరణ లేదని ఆరోపించారు. యువ అథ్లెట్లకు కనీసం ట్రైన్ టికెట్లు ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు.

Also Read: Bangladesh High Commission: బంగ్లాదేశ్‌లో ఘటనలు.. ఢిల్లీలో హైకమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాల నిరసనలు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×